విద్య, వైద్య, ఐటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాలలో సహకారం అందించుకోవడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి అన్నారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో US Consulate General Joel Riefman ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం తో పాటు సాగు నీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. మంచి వాతావరణంలో Good Eco System లతో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఆమెరికా, భారత్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని అన్నారు. విద్యార్ధుల సమస్యలు ఏమైనా ఏర్పడినపుడు వెంటనే స్పందించాలన్నారు. US Consulate General మాట్లాడుతూ తెలంగాణ, ఆమెరికా ల స్నేహ పూర్వక మైత్రి మరింత పెంపొందించేలా కృషి చేస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, US Consulate building నిర్మాణం పరిస్ధితి పై చర్చించారు.