వచ్చే నెల చివరి నాటికి వికారాబాద్ లో ని 971 ఆవాసాలకు తాగునీరు – మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి
వచ్చే నెల చివరి నాటికి వికారాబాద్ లో ని 971 ఆవాసాలకు బల్క్ గా తాగునీరు అందుతుందన్నారు మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 25 నుంచి దశల వారీగా నీటి సరాఫరా మొదలు కావాలన్నారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కొడంగల్ లో కడుతున్న హెడ్ వర్క్స్ ను ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.
పనులు జరుగుతున్న తీరు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ మేనేజర్ ను మార్చాలని వర్క్ ఏజెన్సీ ని ఆదేశించారు. ఆతర్వాత వికారాబాద్ కలెక్టరేట్ లో జిల్లా భగీరథ పనుల పురోగతి ని సమీక్షించారు.
వర్క్ ఏజెన్సీ లతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని అధికారులను ఆదేశించారు.
లేబర్ ను పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో
వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవ రావు, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, RWS&S కార్యదర్శి స్మితా సభర్వాల్, Rws&s ENC సురేందర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ కృపాకర్ రెడ్డి,OSD సత్యపాల్ రెడ్డి, ఎస్.ఈ చిన్నారెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.