రైతు రాజు కావడం ఖాయం: కేసిఆర్
రైతుల అవసరాలు తీర్చడమే రైతు సమన్వయ సమితుల ప్రధాన విధులని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో (మండల, జిల్లా, రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యక్తిగా ఏమి సాధించలేమని, సమిష్టిగా ఉంటేనే కఠిన ప్రయత్నాలు కూడా సులభతరం అవుతాయని అన్నారు. సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంలో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో జల వనరులను అభివృద్ధి పరిచే క్రమంలో చిన్న, మధ్యతరహ, భారీ నీటి ప్రాజెక్టులను చేపట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్నివ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని నేడు జరిగిన ఉత్తర తెలంగాణ 17 జిల్లాల ప్రాంతీయ సమావేశంలో ముఖ్యమంత్రి ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని ఆమోదించారు.
రైతు రాజు కావడం ఖాయమని భవిష్యత్తులో దేశంలో గొప్ప, ధనిక రైతులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారనే స్థితి రాబోతుందని దీనికి గాను రైతు సమన్వయ సమితులతో పాటు అధికారులు చిత్తశుద్ధితో తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. ఈ యాసంగి నుండి ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. దీనితో పాటు పదివేల కోట్లను కూడా రాష్ట్ర సమన్వయ సమితికి పెట్టుబడికి ప్రభుత్వం పూచికత్తు ఇస్తుందని సి.ఎం. తెలిపారు. ఐదు వేల ఎకరాలకు ఒక్కరు చొప్పున వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామని ఒక్కొక్క ఏ.ఈ.ఓ. పరిధిలో 1100 మంది రైతులు ఉన్నారన్నారు. రైతు వేదికల నిర్మాణాలకు బడ్జెటులోసుమారు మూడు నుండి నాలుగు వందల కోట్లను కేటాయించాబోతున్నామని సి.ఎం. తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి Pocharam Srinivas Reddyపోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ద్వారా దేశంలో రైతు భవిష్యత్తును మార్చబోతున్నామని అన్నారు. దేశంలోనే రైతులు ఆత్మగౌరవంతో జీవించడానికి గౌరవ ముఖ్యమంత్రి విశేష కృషి చేస్తున్నారని అన్నారు.