రెక్కలు పథకంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఎఎన్ఎంలకు ద్వి చక్ర వాహనాలను పంపిణీ చేసిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
80మంది ఎఎన్ఎంలకు వాహనాలను పంపిణీ చేసిన మంత్రి లక్ష్మారెడ్డి
ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయడానికే రెక్కులు అనే కార్యక్రమం ద్వారా ఈ ద్వి చక్రవాహనాలను పంపిణీ చేస్తున్నాం
గ్రామాల్లో పర్యటించి వైద్యం అందించాల్సిన ఎఎన్ఎంలకు ఈ ద్వి చక్రవాహనాలు రవాణాకు సౌకర్యవంతంగా ఉంటాయి
ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్న ఎఎన్ఎంలకు ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయం అందిస్తున్నది
నేషనల్ హెల్త్ మిషన్ నుంచి రూ.10వేలు, క్రూషియల్ బ్యాలన్స్ ఫండ్ నుంచి కలెక్టర్ రూ.5 వేలు, డీలర్స్ తమ లాభాల నుంచి తగ్గించుకుని రూ.3 వేలు కన్సెషన్ ఇస్తున్నారు
మిగతా డబ్బులను లబ్దిదారులైన ఎఎన్ఎంలే భరించాల్సి ఉంటుంది. తక్కువ ఇఎంఐలతో మిగతా డబ్బులను చెల్లించుకునే వెసలుబాటు ఉంది
ఈ వాహనాల ద్వారా ప్రభుత్వ వైద్యాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయాలి
ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఎఎన్ఎంలు పని చేయాలి
సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం
ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ, స్థానిక ప్రజాప్రతినిధులు, డిఎంహెచ్ఓ డాక్టర్ రజని, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.