రిటైర్డ్ పారా మిలిటిరీ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి – రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహరెడ్డి
హైదరాబాద్ ఫిబ్రవరి 24 :దేశ రక్షణకోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిన పారా మిలిటిరీ, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్,ఐటిబిపి,ఎస్ఎస్బి,అస్సాంరైఫిల్స్ సైనికులల సేవలు మరువ లేనివని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహరెడ్డి అన్నారు.శనివారం సిఅర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో నిర్వహించిన పారా మిలిటిరీ, మాజీ సైనిక ఉద్యోగులు వారి కుటుంబ సబ్యులకు చెందిన భారీ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. రిటైర్డ్ ఐన పారా మిలిటిరీ,బిఎస్ఎఫ్,సిఐఎస్ఎఫ్,ఐటిబిపి,ఎస్ఎస్బి, మాజీ సైనిక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కృత నిచ్చయం తో ఉందని మంత్రి తెలిపారు.
ఈ సందర్బంగా ఆల్ ఇండియా సెంట్రల్ ఆర్మీఫోర్సు,మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం విజ్ఞప్తుల ఫై మంత్రి సానుకూలంగా స్పందించారు.సంఘం చేసిన విజ్ఞప్తులను ముఖ్య మంత్రి దృష్టికి తీసుకవెల్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నాయిని హామీ ఇచ్చారు.అంతకు ముందు సంఘం జాతీయ కార్యదర్శి తుమ్మల రాజేష్ కుమార్ మాట్లాడుతూ మాజి జవాన్లకు విద్య,వైద్యం,ఆరోగ్య రంగాలలో రిజర్వేషన్లు అమలు చేయాలనీ,అన్ని జిల్లా కేంద్రాలలో రిటైర్డ్ పారామిలిటిరి సిబ్బందికి ఉచిత వైద్యం అందించాలని కోరారు.ఈ సందర్బంగా సంఘం ఆధ్యర్యం లో హోం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర సచివాలయం లో సైనిక బోర్డ్ కార్యాలయం మాదిరిగా రిటైర్డ్ పారామిలిటిరి సిబ్బందికి వారి సేవా నిమిత్తం కార్యాలయం ఏర్పాటు చేయాలనీ,కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ పారామిలిటిరి సిబ్బందికి కోసం జారి చేసిన జి.ఓ.లను అమలు చేయాలని, 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాఇంచాలని,ప్రొఫెషనల్ టాక్స్ ,ఇంటి పన్ను రద్దు చేయాలనీ కోరారు. వీటి ఫై స్పందించిన నాయిని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న జి.ఓ లను ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిస్కరిస్త్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోసి ఆర్.పి.ఎఫ్ అదనపు డి.జి. పంకజ్ కుమార్, సిఐఎస్ఎస్ఎఫ్ ఐ.జి.జగ్బీర్ సింగ్ ,ఎస్డి పాండే, ఆర్.పి.ఎఫ్ డిఐజి తదితరులు ప్రసంగించారు. జాతీయ అద్యక్షులు అహమ్మద్ అలీ,జాతీయ అదనపు కార్యదర్శి,రాష్ట్ర అద్యక్షులు జి.వి.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కే.పి సైదులు తదితరులు పాల్గొన్నారు.