రాష్ట్ర వ్యాప్తంగా 8 క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స కేంద్రాలు
మంత్రి లక్ష్మారెడ్డితో సమావేశమైన టాటా ట్రస్ట్ ప్రతినిధులు
అపెక్స్ కేంద్రంగా ఎంఎన్జె హాస్పిటల్
హైదరాబా: రాష్ట్ర వ్యాప్తంగా 8 క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇందుకు అవసరమైన సాంకేతిక, పరికర, ఇతర సహకారాలను టాటా ట్రస్ట్తో తీసుకోవాలని తలపోస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి తో టాటా ట్రస్ట్ ప్రతినిధులు సచివాలయంలోని మంత్రి చాంబర్లో సమావేశమయ్యారు. వారు మంత్రితో ఆయా అంశాల మీద చర్చించారు.