రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, పద్మా రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.