పోలీస్ అమరవీరుల దినం పురస్కరించుకొని ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా లో పోలీస్ అమరవీరుల కు ఘన నివాళి సమర్పిచడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్ల్లా SP శ్రీ విశ్వజిత్ కాంపాటి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా SP. గారు మాట్లాడుతూ మైన్స్ డిగ్రీల చలిలో దేశ సరిహద్దు లకు చేరుకోవడమే చాలా కష్టం, అలాంటిది ఆ రోజుల్లో దేశ సరిహద్దు గస్తీ కాస్తూ దేశ రక్షణార్థం ప్రాణాలకి ఎదురొడ్డి పోరాడి వీర మరణం పొందిన పోలీస్ అమర వీరుల త్యాగాల ను మరువలేనివని, చందుర్తి, రుద్రంగి లాంటి ప్రాంతాలో ఇంత స్వేచ్ఛగా అడవిలో ప్రదేశంలో అందరం ఇంత స్వేచ్ఛగా సమావేశం అయ్యాము అంటే అది ఎందరో పోలీస్ అమర వీరుల త్యాగాల ఫలితం అని తెలిపి ” నేరాలు నేరస్థులు తో మేము ప్రతిక్షణము శాంతి స్థాపనకు పోరాడుతానము, ఈ రోజు మా పోలీస్ అమరవీరుల త్యాగాలను, కన్నీటి బాధలను గుర్తుచేసుకుంటున్నాము అని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ప్రఘాడ సానుభూతి తెలియజేసారు. ఈ వారోత్సవాలలో భాగంగా జిల్లాలో విద్యార్థులకి నిర్వహించిన పలు కార్యక్రమలలో విజేతలకు SP గారు, కలెక్టర్ గారు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో SDPO వేములవాడ, జిల్లా CI s , SIs , పోలీస్ సిబ్బంది, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.