రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం సర్దాపూర్ లో గోదాములు, పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి కేటిఆర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపి శ్రీ వినోద్ కుమార్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ చెన్నమనేని రమేష్ తదితరులు పాల్గొన్నారు