తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో కళాభవన్, రవీంధ్రభారతిలో నిర్వహిస్తున్న “సినివారం” – 04-March-2017
ఈ శీర్షికతో షార్ట్ ఫిల్మ్స్/డాక్యుమెంటరీలు/ఫీచర్ ఫిల్మ్స్ ప్రతీ శనివారం రవీంద్రభారతి సమావేశమందిరం (మొదటి అంతస్తు) లో ఉచితంగా ప్రదర్శన చేస్తున్నారు.
ఈ రోజు సినివారంలో భాగంగా…
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో శ్రీ హుమాయున్ సంఘీర్ రూపొందించిన తెలంగాణ కళారూపాల్లో ఒకటి అయినటువంటి “కోలాటం” డాక్యుమెంటరీ ఫిల్మ్ ని ప్రదర్శించారు. సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో ఇప్పటివరకు దాదాపుగా 12 కళారూపాల డాక్యుమెంటరీలను రూపొందించటం జరిగింది. ఇవి భవిష్యత్తు తరాలకు తెలిసేలా, ఉపయోగపడేలా రీసర్చ్ చేసి, రచించి యువ దర్శకుల దర్శకత్వంలో రూపొందించబడినవి. అందులో కోలాటం ఒకటి. ఆ ఫిల్మ్ ఈ రోజు సినివారంలో భాగంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న వజ్రాలు కావాలా నాయన కథానాయకుడు శ్రీ అనిల్ బూరగాని మాట్లాడుతూ సినివారం కార్యక్రమం అద్భుతంగా ఉంది, 3 నెలల నుంచి బాగా వింటున్నాను, నా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఈ వేదిక పై ప్రదర్శింపచేయాలని అనుకుంటున్న, సంఘర్ తీసిన డాక్యుమెంటరీ వచ్చే తరాలకు ఉపయోగపడుతుంది అని సంఘీర్ మరియు బృందానికి అలాగే సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ గారు చేస్తున్నది భవిష్యత్తు వారికి తెలుస్తుంది కళారూపాల గురించి అన్నారు.
ఈ డాక్యుమెంటరీ దర్శకుడు శ్రీ సంఘీర్ మాట్లాడుతూ ఈ ఫిల్మ్ తీయటానికి అవకాశం ఇచ్చిన సంచాలకులు హరికృష్ణ గారికి అలాగే తన సినిమాలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో ఇంకా మంచి సినిమాలు తీస్తానని, ప్రస్తుతం 2 సినిమాలకు డైలాగ్స్ అలాగే స్క్రీన్ ప్లే వహిస్తున్నట్లు, చిమ్మి అనే షార్ట్ ఫిల్ తీయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంకా జబర్దస్త్ ఫేమ్ కొమురం, రైతుబిడ్డ నితిన్, శ్రావణ్ శాస్త్రవేత్త, ఈ డాక్యుమెంటరీ దర్శక, రచయిత శ్రీ హుమాయున్ సంఘీర్ మరియు బృందం, ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించిన కోలాటం గురువు కన్న సాంబయ్య, ఔత్సాహిక యువ ఫిల్మ్ మేకర్స్, సాంకేతిక నిపుణులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర అతిథులు, సినీ ప్రేమికులు, సినివారం కుటుంబం పలువురు ప్రముకులు పాల్గొననున్నారు.