యువ శాస్త్రవేత్తలు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలి – గవర్నర్ నరసింహన్ పిలుపు
హైదరాబాద్ డిసెంబర్ 13 : యువ శాస్త్రవేత్తలు పల్లెలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ మొదటి వార్షికోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ పీజీ, పీహెచ్డీకి చెందిన 207 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ దేశానికి రైతే వెన్నెముక అన్నారు. వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. అధిక సాగుబడికి మనవంతు సహకారం అందించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వీసీ ప్రవీణ్రావు, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.