యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవములు -2017, శ్రీ స్వామి వారి తిరుకళ్యాణ వైభవోత్సవము 06-March-17, DAY-8శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్ట
శ్లో: శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత చరణ్య భవాబ్ది పోత, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్
యాదాద్రి: యాదాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా ప్రారంభమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం. పాల్గొన్న కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహమూర్తి. భారీగా హాజరైన భక్తులు.
స్వస్తి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి సోమవారము తేదీ 27-02-2017 నుండి 09-03-2017 గురువారము ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా జరుగుచున్నవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు తేది 05-03-2017 ఆదివారము రోజున శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్యహవనములు, మూలమంత్రజపములు, హోమములు, పారాయణములు నిర్వహింపబడినవి. అనంతరము “ప్రభాత భేరి” స్థానిక శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య వారిచే సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు బాలాలయములో భక్తులు స్థానికులు పాల్గొనగా చక్కగా నిర్వహింపబడినవి.
అనంతరము శ్రీ స్వామి వారిని “జగన్మోహినీ అలంకార సేవలో అలంకరించి పారాయణీకుల స్తోత్ర పఠనములతో ఉత్సవ సేవను ఆలయ అధికారులు, భక్తులు పాల్గొనగా ఎంతో వేడుకగా బాలాలయములో నిర్వహించిరి. ఈ వేడుకలో ఆలయ ఛైర్మన్ శ్రీ బి. నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత గారు, ఆలయ పేష్కార్, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొనిరి.
జగన్మోహినీ అలంకార సేవ విశిష్టత: బ్రహ్మోత్సవములలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అలంకారము శ్రీ జగన్మోహినీ అలంకారము. దేవదానవులు క్షీర సాగర మధనము గావించగా, ఆవిర్భవించిన అద్భుత కలశమును దానవులు అపహరించగా దేవతలు దిక్కుతోచని స్థితిలో ఉండగా శ్రీ మహా విష్ణువు ఒక అపూర్వమైన జగన్మోహనాకారమైన రూపమును ధరించి తన అపూర్వమైన హావ భావ చేష్టలతో సౌందర్య, విలాస చూపులతో, దానవుల వైపు వెళ్ళి, వారి రాక్షస ప్రవృత్తికి సమ్మోహనమును కలిగించి వారి వద్ద ఉన్న అమృత కలశమును చేబూని అందరికీ క్రమములో అందించగలనని మాయా మోహమును కల్పించి సత్వ రుణ ప్రధానములైన దేవతలకు ఈ అమృతమును అందించిన అపూర్వమైన తత్వమే ఈ జగన్మోహినీ అవతార రహస్యము. ఈ అలంకార సేవను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వరూపములో దర్శించిన అరిషడ్వర్గములు (కామ క్రోధాదులు) తొలగి అమృతమయమైన ఆనందమును పొందగలరని వేదాంతుల భక్తి తత్వము, ప్రకృతి మాయా స్వరూపిణి అని అసుర ప్రవృత్తి గల వారలు ఈ మాయకు లోనగుదురని, దానిని తొలగించే సామర్థ్యము పరమాత్మకే కలదు అని భక్తుల విశ్వాసము.
“ప్రభాతభేరి” స్థానిక శ్రీ వైష్ణవ సేవాసమాఖ్యా వారిచే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు గావింపబడినది. అనంతరము శ్రీ స్వామి వారి ఆలయములో నిత్య హవనములు, పారాయాణీకులచే మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు దివ్యా ప్రభందాది పారాయణములు నిర్వహింపబడినవి. అనంతరము ఉదయము గం.10-00లకు శ్రీ స్వామి వారి “శ్రీరామ అలంకారములో హనుమంత వాహాన శేవ” లో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యము కలిగించిరి. ఈ కార్యక్రమములో ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ బి.నరసింహ మూర్తి గారు కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత గారు, ఆలయ పేష్కార్ శ్రీ డి.భాస్కర శర్మ, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని సేవించి తరించిరి.
“శ్రీరామ అలంకారము (హనుమంత వాహనశేవా) ప్రాముఖ్యత”
భగవానుని అన్ని అవతారములు అపూర్వములే అయినను మానవ భూమికను నిర్వహించి ధర్మాన్ని ఆచరించి ఆదర్శవంతమైన జీవన సరళిలో నడయాడి జనరంజకముగా రాజ్యపాలన గావిస్తూ సత్యవ్రత దీక్షలో అనేక ఒడిదుడుకులను పొంది వశిష్టాది మహర్షులచేత ఏకైక ధర్మమూర్తిగా పేరొంది మహనీయ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. అయోధ్యవాసులు ముక్త కంఠంతో రామచంద్రుని రాజ్యపాలన గావించమని వేడుకొనుట. మహర్షులు రాక్షస బాధను తొలగించమని ప్రార్థించుట, దేవకోటి రావణాది సంహారార్థము స్తుతించుట తన పరివారమైన అనంత (వాసుకీ మొదలగు) వారల కైంకర్యములను స్వీకరించుటకై అష్టకష్టములను అనుభవించి ఆదర్శవంతమైన నడవడికను లోకాలకు అందించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. బ్రహ్మోత్సవములలో శ్రీరామ అలంకారమునకు ఒక ప్రత్యేకతను పేర్కొంటూ సీతాదేవి రామచంద్రుని “రాఘవ సింహంగా” సంభోదించుట, మారీచాది రాక్షసులు రామచంద్రమూర్తిని “నరసింహ స్వామిగా” తలచుట. హనుమంతుడు రామచంద్రుణ్ణి సాక్షాత్తు శ్రీ నృసింహ స్వామియే అని రావణుడికి తెలియపరచుట రావణాసురుడు సైతము యుద్ధభూమిలో రామచంద్రుడిని సాక్షాత్తు నరసింహుడిగానే పీర్కొనుట. విశ్వామిత్రాది మహర్షులు, “నరశార్థూల” అని సంభోధించుట గమనించిన శ్రీరామ, నృసింహ అవతారములు ఏకస్వరూపములే అని తెలియబడుచున్నది.
శ్రీ స్వామి వారి బాలాలయములో ఉదయము గం.11-00ల నుండి బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ మహోత్సవము పాంచారాత్రాగమశాస్త్ర రీత్యా యజ్ణాచార్యులు శ్రీమాన్ ఎస్.శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు ఎస్.లక్ష్మీనరసింహాచార్యులు, కె.నరసింహాచార్యులు, అర్చక బృందం నిర్వహించిరి శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవమును పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వము పక్షాన పట్టు వస్త్రములను ముత్యాల తలంబ్రాలను గౌరవనీయులు స్థానిక శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు శ్రీమతి అనితారామచంద్రన్ గారు, జాయింట్ కలెక్టరు శ్రీ రవినాయక్ గారు, D.C.P యాదగిరి గారు, డి.ఎస్.పి గారు, స్థానిక సి.ఐ., ఎస్..ఐ. మరియు కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎస్.గీత గారు, ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ బి.నరసింహ మూర్తి గారు ఉద్యోగ సిబ్బంది భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని సేవించి తరించిరి.
సాయంకాల కార్యక్రమములు
ఈరోజు సాయంకాలము బాలాలయములో యధావిధిగా హవనములు, మూలమంత్ర జపములు, లక్ష్మీ సూక్త పారాయణములు, శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణములు, యజ్ణాచార్యులు, అర్చక బృందం పారాయణము గావించెదరు. అనంతరము శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవ కళ్యాణ వైభోత్సవము కొండక్రింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత స్కూలు ఆవరణలో రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణలతో, బ్యాండు మేళముల మద్య భక్తుల కోరిక మేర అత్యంత వైభవముగా నిర్వహించెదరు. ఇట్టి కార్యక్రమమునకు ప్రముఖులు, అధికారులు, ఆలయ సిబ్బంధి, భక్తులు విశేషముగా పాల్గొనెదరు.
“అంగరంగ వైభవముగా జోనసాగిన శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మహోత్సవము”
శ్రీ స్వామి వారి తిరుకళ్యాణ వైభవోత్సవము విశిష్టత
భక్తజన పరిపాలకుడు ఆశ్రిత జన రక్షకుడు అగు శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణము, జగత్ కళ్యాణము అని అనేక పురాణములు పేర్కొనుచున్నవి. బ్రహ్మాది దేవతలు అలనాడు శ్రీ స్వామి వారికి నిర్వహించిన కళ్యాణ సంబరములే ఆగమశాస్త్రానుసారముగా నిర్వహించుట నేటికీ ఆనగాయితి, శ్రీ స్వామి వారి కళ్యాణము శుభప్రధము కావున ఈ వేళలో భగవనుగ్రహము పరిపూర్ణముగా లభించునని లక్ష్మీ అమ్మవారితో కూడిన శ్రీ నరసింహ స్వామి వారు భక్తకోటికి అపూర్వమైన వరములను అందించుచూ సర్వవేళళా సంరక్షించునని ఆగమశాస్త్రములు సూచించుచున్నందున బ్రహ్మోత్సవములలో ఈ కళ్యాణ మహోత్సవము నిర్వహించెదరు. చతుర్థ అవతారము శ్రీ నృసింహ ఆవిర్భావము అనంతరము బ్రహ్మాధిదేవతలు హిరణ్యకశ్యపుని వధించి ఉగ్ర స్వరూపంలో ఉన్న నృసింహ స్వామి వారిని శాంతపరచుటకు పలు విధములుగా ప్రస్తుతించిరి. కానీ తన భక్తుడైన ప్రహ్లాదుని పట్ల కఠోరమైన హింసా ప్రవృత్తి కలిగిన హిరణ్యకష్యపునిపై కోపము తగ్గక దిక్కులు పెక్కటిల్లేలా గర్జిస్తున్న స్వామిని చూసి ప్రహ్లాదుడు శ్రీ స్వామివారిని ప్రసన్నుడిని గావించుటకై స్త్రోత్రము చేసి ప్రక్కనే ఉన్న అమ్మవారితో కళ్యాణ మహోత్సవము జరిపించినట్లు నృసింహ పురాణము, శ్రీమత్ భాగవతము పేర్కొనుచున్నవి. శ్రీ స్వామివారి ప్రసన్నమైన మనస్సును దర్శింపదలచిన బ్రహ్మాదిదేవతల మనోరధమును నెరవేర్చిన శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణ మహోత్సవము భక్తకోటి మనస్సులను నెరవేర్చుటకు నిర్వహించబడుచున్నది.
శ్రీ రామ అవతారములో శ్రీరామచంద్ర స్వామి సీతా సమేతుడై నృసింహ కళ్యాణ ఆరాధనలు గావించినట్లు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, నృసింహ స్వామి వేడుకలు నిర్వహించిన పిదపనే పద్మావతి అమ్మవారితో కళ్యాణము జరిగినట్లు బ్రహ్మేంద్రాది దేవతలు వారి వారి వైభోగములు అనుభవించుటలో ప్రతినిత్యము నృసింహ ఆరాధన గావించుటయే ప్రధాన కారణమని, ఒక నృసింహ అనుగ్రహము కలిగినచో సమస్త దేవకోటి అనుగ్రహము లభించునని వేదములు, పురాణములు, ఇతిహాసములు పేర్కోనుచున్నవి.
05-03-2017 (ఆదివారకు) సాయంకాల కార్యక్రమములు ఎంతో భక్తి భరితముగా నిర్వహింపబడినది
ధార్మిక, సాహిత్య, సంగీత మహా సభలు
బ్రహ్మోత్సవములలో భాగంగా తేదీ.05-03-2017 ఆదివారము రోజున శ్రీమతి జి.జానకి బృందం (శ్రీ గోవర్ధనం వెంకటారామానుజాచార్యుల కళాశాల) వారిచే భక్తి సంగీత కార్యక్రమము ఎంతో భక్తి భరితముగా నిర్వహింపబడినది. వీరు శ్రీ నృసింహ పరమైన కీర్తనలు ఆలపించి భక్తులను ఆనందింపజేసిరి. అనంతరము భక్తరామదాసు బృందం సంగీత సిస్టర్స్ వారిచే భక్తి సంగీత విభావరి నిర్వహింపబడినది. వీరు పలుకే బంగారమాయనే, తారకమంత్రం కోరిన అంటూ పలు భక్తరామదాసు రచించిన శ్రీరాముడి కీర్తనలు భక్తుల మద్య ఆలపించి భక్తులను ఆనందింపజేసిరి. పిదప చిII పల్లవిచే భక్తి సంగీత కార్యక్రమము నిర్వహింపబడినది. వీరు పలు అన్నమాచార్య కీర్తనలు పాడిరి. తదుపరి మంజులానాయుడు వారి బృందము వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన గావింపబడినది. తదుపరి నాగదుర్గా బృందం నల్లగొండ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహింపబడినది. వీరు దశావతారములు, భాహ్మాంజలి, తిల్లానా” మొదలగు అంశములపై నృత్య ప్రదర్శన భక్తుల మద్య నిర్వహించిరి. పిదప స్వాతి సోమనాథ్ గారి శిష్య బృందము వారిచే నృత్య ప్రదర్శన గావింపబడినది. వీరు సుప్రసిద్ధ నాట్యకారులైనందున వీరి శిష్య బృందము నృత్య ప్రదర్శన భక్తులకు ఆనందింపజేసినది. అనంతరము గడ్డం పాండు బృందాముచే చెంచులక్ష్మి అను చిందు యక్షగాన ప్రదర్శన నిర్వహించబడినది. వీరి ప్రదర్శనను చూసి భక్తులు ఆనందించిరి.
06-03-2017 (సోమవారము) కార్యక్రమములు
ఉదయం కార్యక్రమములు
ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు
ఈ రోజు ఉదయం గం.౭.౦౦ల నుండి గం.8.00ల వరకు శ్రీరామ భజన మండలి, మల్లాపురం వారిచే భజన కార్యక్రమము నిర్వహించబదినది. పిదప శ్రీ ఎస్.కేశవులు అండ్ బృందం హైద్రాబాద్ వారిచే భక్తి భజన కార్యక్రమము నిర్వహించబదినది. అనంతరము ఆస్థాన విద్వాంసులచే నాద కచేరి, ఆస్థాన వేదపండితులచే వైధిక ప్రార్ఠన నిర్వహించబదినది. తదుపరి డాII కందాడై శ్రీనివాసాచార్యులు, హైద్రాబాదు వారిచే ఆధ్యాత్మిక ప్రవచనము గావించబడినది. వీరు శరణాగత తత్త్వము గూర్చి వివరించిరి. సమన్వయ కర్తగా దరూరి రామానుజాచార్యుల వారు వ్యవహరించిరి. తదుపరి డాII ముదపాక బాలసుందరం భాగవతార్ వారిచే విరాటపర్వము (కీచక వథ) హరికథా గానము గావింపబడినది. వీరి కధాగానము భక్త మనోరంజకముగా కొనసాగినది. వీరికి నిలయ విద్వాంసులు, వాయిద్య సహకారములు అందించిరి.
ఉచిత వైద్య శిబిరము:- తేది. 06-03-2017
ఈ రోజు సాయి సంజీవిని హాస్పిటల్స్ వారు భ్రహ్మోత్సవములకు విచ్చేయు భక్తులకు ఉచితముగా తమ వైద్యసేవలను అందించిరి. వీరు కాలేయము, జీర్ణకోశ వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు మొదలగు వ్యాధులకు భక్తులకు పరీక్షలు జరిపి చికిత్సను అందించిరి.
తేది. 06-03-2017 సోమవారము సాయంకాల కార్యక్రమములు:-
1 |
భక్తి సంగీతం |
శ్రీమతి ఎన్.జగదీశ్వరి బృందం వారిచే |
గం.5.00 నుండి గం.6.00ల వరకు |
2 | భక్తి సంగీతం | తిరుమల మానసావీణ | గం.6.00 నుండి గం.7.00ల వరకు |
3 | కూచిపూడి నృత్యం | శ్రీమతి రంగమణి బృందం హైద్రాబాద్ వారిచే కొండ క్రింద జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలొ బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ స్వామివారి కళ్యాణ వైభవోత్సవము ముందు. | గం.7.00 నుండి గం.7.30ల వరకు |
4 | శ్రీ స్వామి వారి కళ్యాణ వైభవోత్సవము | కొండ క్రింద జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలొ బస్ స్టాండ్ ఎదురుగా | గం.8.00 నుండి గం.10.00ల వరకు |
Contents
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవములు -2017, శ్రీ స్వామి వారి తిరుకళ్యాణ వైభవోత్సవము 06-March-17, DAY-8శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్టశ్లో: శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే, భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తేయోగీశ శాశ్వత చరణ్య భవాబ్ది పోత, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబమ్యాదాద్రి: యాదాద్రి నరసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైభవంగా ప్రారంభమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం. పాల్గొన్న కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో గీతారెడ్డి, చైర్మన్ నర్సింహమూర్తి. భారీగా హాజరైన భక్తులు.స్వస్తి శ్రీ దుర్ముఖి నామ సంవత్సర, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి సోమవారము తేదీ 27-02-2017 నుండి 09-03-2017 గురువారము ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు బ్రహ్మోత్సవములు అత్యంత వైభవముగా జరుగుచున్నవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు తేది 05-03-2017 ఆదివారము రోజున శ్రీ స్వామి వారి బాలాలయములో నిత్యహవనములు, మూలమంత్రజపములు, హోమములు, పారాయణములు నిర్వహింపబడినవి. అనంతరము “ప్రభాత భేరి” స్థానిక శ్రీ వైష్ణవ సేవా సమాఖ్య వారిచే సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు బాలాలయములో భక్తులు స్థానికులు పాల్గొనగా చక్కగా నిర్వహింపబడినవి.అనంతరము శ్రీ స్వామి వారిని “జగన్మోహినీ అలంకార సేవలో అలంకరించి పారాయణీకుల స్తోత్ర పఠనములతో ఉత్సవ సేవను ఆలయ అధికారులు, భక్తులు పాల్గొనగా ఎంతో వేడుకగా బాలాలయములో నిర్వహించిరి. ఈ వేడుకలో ఆలయ ఛైర్మన్ శ్రీ బి. నరసింహమూర్తి గారు, కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత గారు, ఆలయ పేష్కార్, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొనిరి.జగన్మోహినీ అలంకార సేవ విశిష్టత: బ్రహ్మోత్సవములలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అలంకారము శ్రీ జగన్మోహినీ అలంకారము. దేవదానవులు క్షీర సాగర మధనము గావించగా, ఆవిర్భవించిన అద్భుత కలశమును దానవులు అపహరించగా దేవతలు దిక్కుతోచని స్థితిలో ఉండగా శ్రీ మహా విష్ణువు ఒక అపూర్వమైన జగన్మోహనాకారమైన రూపమును ధరించి తన అపూర్వమైన హావ భావ చేష్టలతో సౌందర్య, విలాస చూపులతో, దానవుల వైపు వెళ్ళి, వారి రాక్షస ప్రవృత్తికి సమ్మోహనమును కలిగించి వారి వద్ద ఉన్న అమృత కలశమును చేబూని అందరికీ క్రమములో అందించగలనని మాయా మోహమును కల్పించి సత్వ రుణ ప్రధానములైన దేవతలకు ఈ అమృతమును అందించిన అపూర్వమైన తత్వమే ఈ జగన్మోహినీ అవతార రహస్యము. ఈ అలంకార సేవను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వరూపములో దర్శించిన అరిషడ్వర్గములు (కామ క్రోధాదులు) తొలగి అమృతమయమైన ఆనందమును పొందగలరని వేదాంతుల భక్తి తత్వము, ప్రకృతి మాయా స్వరూపిణి అని అసుర ప్రవృత్తి గల వారలు ఈ మాయకు లోనగుదురని, దానిని తొలగించే సామర్థ్యము పరమాత్మకే కలదు అని భక్తుల విశ్వాసము.“ప్రభాతభేరి” స్థానిక శ్రీ వైష్ణవ సేవాసమాఖ్యా వారిచే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణములు గావింపబడినది. అనంతరము శ్రీ స్వామి వారి ఆలయములో నిత్య హవనములు, పారాయాణీకులచే మూలమంత్ర, మూర్తి మంత్ర జపములు దివ్యా ప్రభందాది పారాయణములు నిర్వహింపబడినవి. అనంతరము ఉదయము గం.10-00లకు శ్రీ స్వామి వారి “శ్రీరామ అలంకారములో హనుమంత వాహాన శేవ” లో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యము కలిగించిరి. ఈ కార్యక్రమములో ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ బి.నరసింహ మూర్తి గారు కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎన్.గీత గారు, ఆలయ పేష్కార్ శ్రీ డి.భాస్కర శర్మ, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని సేవించి తరించిరి.“శ్రీరామ అలంకారము (హనుమంత వాహనశేవా) ప్రాముఖ్యత”భగవానుని అన్ని అవతారములు అపూర్వములే అయినను మానవ భూమికను నిర్వహించి ధర్మాన్ని ఆచరించి ఆదర్శవంతమైన జీవన సరళిలో నడయాడి జనరంజకముగా రాజ్యపాలన గావిస్తూ సత్యవ్రత దీక్షలో అనేక ఒడిదుడుకులను పొంది వశిష్టాది మహర్షులచేత ఏకైక ధర్మమూర్తిగా పేరొంది మహనీయ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. అయోధ్యవాసులు ముక్త కంఠంతో రామచంద్రుని రాజ్యపాలన గావించమని వేడుకొనుట. మహర్షులు రాక్షస బాధను తొలగించమని ప్రార్థించుట, దేవకోటి రావణాది సంహారార్థము స్తుతించుట తన పరివారమైన అనంత (వాసుకీ మొదలగు) వారల కైంకర్యములను స్వీకరించుటకై అష్టకష్టములను అనుభవించి ఆదర్శవంతమైన నడవడికను లోకాలకు అందించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. బ్రహ్మోత్సవములలో శ్రీరామ అలంకారమునకు ఒక ప్రత్యేకతను పేర్కొంటూ సీతాదేవి రామచంద్రుని “రాఘవ సింహంగా” సంభోదించుట, మారీచాది రాక్షసులు రామచంద్రమూర్తిని “నరసింహ స్వామిగా” తలచుట. హనుమంతుడు రామచంద్రుణ్ణి సాక్షాత్తు శ్రీ నృసింహ స్వామియే అని రావణుడికి తెలియపరచుట రావణాసురుడు సైతము యుద్ధభూమిలో రామచంద్రుడిని సాక్షాత్తు నరసింహుడిగానే పీర్కొనుట. విశ్వామిత్రాది మహర్షులు, “నరశార్థూల” అని సంభోధించుట గమనించిన శ్రీరామ, నృసింహ అవతారములు ఏకస్వరూపములే అని తెలియబడుచున్నది.శ్రీ స్వామి వారి బాలాలయములో ఉదయము గం.11-00ల నుండి బ్రహ్మోత్సవ తిరుకళ్యాణ మహోత్సవము పాంచారాత్రాగమశాస్త్ర రీత్యా యజ్ణాచార్యులు శ్రీమాన్ ఎస్.శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు ఎస్.లక్ష్మీనరసింహాచార్యులు, కె.నరసింహాచార్యులు, అర్చక బృందం నిర్వహించిరి శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవమును పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వము పక్షాన పట్టు వస్త్రములను ముత్యాల తలంబ్రాలను గౌరవనీయులు స్థానిక శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరు శ్రీమతి అనితారామచంద్రన్ గారు, జాయింట్ కలెక్టరు శ్రీ రవినాయక్ గారు, D.C.P యాదగిరి గారు, డి.ఎస్.పి గారు, స్థానిక సి.ఐ., ఎస్..ఐ. మరియు కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎస్.గీత గారు, ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ బి.నరసింహ మూర్తి గారు ఉద్యోగ సిబ్బంది భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని సేవించి తరించిరి.సాయంకాల కార్యక్రమములుఈరోజు సాయంకాలము బాలాలయములో యధావిధిగా హవనములు, మూలమంత్ర జపములు, లక్ష్మీ సూక్త పారాయణములు, శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణములు, యజ్ణాచార్యులు, అర్చక బృందం పారాయణము గావించెదరు. అనంతరము శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవ కళ్యాణ వైభోత్సవము కొండక్రింద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత స్కూలు ఆవరణలో రంగు రంగుల విద్యుత్ దీపాలంకరణలతో, బ్యాండు మేళముల మద్య భక్తుల కోరిక మేర అత్యంత వైభవముగా నిర్వహించెదరు. ఇట్టి కార్యక్రమమునకు ప్రముఖులు, అధికారులు, ఆలయ సిబ్బంధి, భక్తులు విశేషముగా పాల్గొనెదరు.“అంగరంగ వైభవముగా జోనసాగిన శ్రీ లక్ష్మీనరసింహ కళ్యాణ మహోత్సవము”శ్రీ స్వామి వారి తిరుకళ్యాణ వైభవోత్సవము విశిష్టతభక్తజన పరిపాలకుడు ఆశ్రిత జన రక్షకుడు అగు శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణము, జగత్ కళ్యాణము అని అనేక పురాణములు పేర్కొనుచున్నవి. బ్రహ్మాది దేవతలు అలనాడు శ్రీ స్వామి వారికి నిర్వహించిన కళ్యాణ సంబరములే ఆగమశాస్త్రానుసారముగా నిర్వహించుట నేటికీ ఆనగాయితి, శ్రీ స్వామి వారి కళ్యాణము శుభప్రధము కావున ఈ వేళలో భగవనుగ్రహము పరిపూర్ణముగా లభించునని లక్ష్మీ అమ్మవారితో కూడిన శ్రీ నరసింహ స్వామి వారు భక్తకోటికి అపూర్వమైన వరములను అందించుచూ సర్వవేళళా సంరక్షించునని ఆగమశాస్త్రములు సూచించుచున్నందున బ్రహ్మోత్సవములలో ఈ కళ్యాణ మహోత్సవము నిర్వహించెదరు. చతుర్థ అవతారము శ్రీ నృసింహ ఆవిర్భావము అనంతరము బ్రహ్మాధిదేవతలు హిరణ్యకశ్యపుని వధించి ఉగ్ర స్వరూపంలో ఉన్న నృసింహ స్వామి వారిని శాంతపరచుటకు పలు విధములుగా ప్రస్తుతించిరి. కానీ తన భక్తుడైన ప్రహ్లాదుని పట్ల కఠోరమైన హింసా ప్రవృత్తి కలిగిన హిరణ్యకష్యపునిపై కోపము తగ్గక దిక్కులు పెక్కటిల్లేలా గర్జిస్తున్న స్వామిని చూసి ప్రహ్లాదుడు శ్రీ స్వామివారిని ప్రసన్నుడిని గావించుటకై స్త్రోత్రము చేసి ప్రక్కనే ఉన్న అమ్మవారితో కళ్యాణ మహోత్సవము జరిపించినట్లు నృసింహ పురాణము, శ్రీమత్ భాగవతము పేర్కొనుచున్నవి. శ్రీ స్వామివారి ప్రసన్నమైన మనస్సును దర్శింపదలచిన బ్రహ్మాదిదేవతల మనోరధమును నెరవేర్చిన శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణ మహోత్సవము భక్తకోటి మనస్సులను నెరవేర్చుటకు నిర్వహించబడుచున్నది.శ్రీ రామ అవతారములో శ్రీరామచంద్ర స్వామి సీతా సమేతుడై నృసింహ కళ్యాణ ఆరాధనలు గావించినట్లు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, నృసింహ స్వామి వేడుకలు నిర్వహించిన పిదపనే పద్మావతి అమ్మవారితో కళ్యాణము జరిగినట్లు బ్రహ్మేంద్రాది దేవతలు వారి వారి వైభోగములు అనుభవించుటలో ప్రతినిత్యము నృసింహ ఆరాధన గావించుటయే ప్రధాన కారణమని, ఒక నృసింహ అనుగ్రహము కలిగినచో సమస్త దేవకోటి అనుగ్రహము లభించునని వేదములు, పురాణములు, ఇతిహాసములు పేర్కోనుచున్నవి.05-03-2017 (ఆదివారకు) సాయంకాల కార్యక్రమములు ఎంతో భక్తి భరితముగా నిర్వహింపబడినదిధార్మిక, సాహిత్య, సంగీత మహా సభలుబ్రహ్మోత్సవములలో భాగంగా తేదీ.05-03-2017 ఆదివారము రోజున శ్రీమతి జి.జానకి బృందం (శ్రీ గోవర్ధనం వెంకటారామానుజాచార్యుల కళాశాల) వారిచే భక్తి సంగీత కార్యక్రమము ఎంతో భక్తి భరితముగా నిర్వహింపబడినది. వీరు శ్రీ నృసింహ పరమైన కీర్తనలు ఆలపించి భక్తులను ఆనందింపజేసిరి. అనంతరము భక్తరామదాసు బృందం సంగీత సిస్టర్స్ వారిచే భక్తి సంగీత విభావరి నిర్వహింపబడినది. వీరు పలుకే బంగారమాయనే, తారకమంత్రం కోరిన అంటూ పలు భక్తరామదాసు రచించిన శ్రీరాముడి కీర్తనలు భక్తుల మద్య ఆలపించి భక్తులను ఆనందింపజేసిరి. పిదప చిII పల్లవిచే భక్తి సంగీత కార్యక్రమము నిర్వహింపబడినది. వీరు పలు అన్నమాచార్య కీర్తనలు పాడిరి. తదుపరి మంజులానాయుడు వారి బృందము వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన గావింపబడినది. తదుపరి నాగదుర్గా బృందం నల్లగొండ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహింపబడినది. వీరు దశావతారములు, భాహ్మాంజలి, తిల్లానా” మొదలగు అంశములపై నృత్య ప్రదర్శన భక్తుల మద్య నిర్వహించిరి. పిదప స్వాతి సోమనాథ్ గారి శిష్య బృందము వారిచే నృత్య ప్రదర్శన గావింపబడినది. వీరు సుప్రసిద్ధ నాట్యకారులైనందున వీరి శిష్య బృందము నృత్య ప్రదర్శన భక్తులకు ఆనందింపజేసినది. అనంతరము గడ్డం పాండు బృందాముచే చెంచులక్ష్మి అను చిందు యక్షగాన ప్రదర్శన నిర్వహించబడినది. వీరి ప్రదర్శనను చూసి భక్తులు ఆనందించిరి.06-03-2017 (సోమవారము) కార్యక్రమములుఉదయం కార్యక్రమములుధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలుఈ రోజు ఉదయం గం.౭.౦౦ల నుండి గం.8.00ల వరకు శ్రీరామ భజన మండలి, మల్లాపురం వారిచే భజన కార్యక్రమము నిర్వహించబదినది. పిదప శ్రీ ఎస్.కేశవులు అండ్ బృందం హైద్రాబాద్ వారిచే భక్తి భజన కార్యక్రమము నిర్వహించబదినది. అనంతరము ఆస్థాన విద్వాంసులచే నాద కచేరి, ఆస్థాన వేదపండితులచే వైధిక ప్రార్ఠన నిర్వహించబదినది. తదుపరి డాII కందాడై శ్రీనివాసాచార్యులు, హైద్రాబాదు వారిచే ఆధ్యాత్మిక ప్రవచనము గావించబడినది. వీరు శరణాగత తత్త్వము గూర్చి వివరించిరి. సమన్వయ కర్తగా దరూరి రామానుజాచార్యుల వారు వ్యవహరించిరి. తదుపరి డాII ముదపాక బాలసుందరం భాగవతార్ వారిచే విరాటపర్వము (కీచక వథ) హరికథా గానము గావింపబడినది. వీరి కధాగానము భక్త మనోరంజకముగా కొనసాగినది. వీరికి నిలయ విద్వాంసులు, వాయిద్య సహకారములు అందించిరి.ఉచిత వైద్య శిబిరము:- తేది. 06-03-2017ఈ రోజు సాయి సంజీవిని హాస్పిటల్స్ వారు భ్రహ్మోత్సవములకు విచ్చేయు భక్తులకు ఉచితముగా తమ వైద్యసేవలను అందించిరి. వీరు కాలేయము, జీర్ణకోశ వ్యాధులు, మోకాళ్ళ నొప్పులు మొదలగు వ్యాధులకు భక్తులకు పరీక్షలు జరిపి చికిత్సను అందించిరి.తేది. 06-03-2017 సోమవారము సాయంకాల కార్యక్రమములు:-1భక్తి సంగీతంశ్రీమతి ఎన్.జగదీశ్వరి బృందం వారిచేగం.5.00 నుండి గం.6.00ల వరకు