మాజీ గవర్నర్ కే.రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి
-ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు
మాజీ ముఖ్య మంత్రి, మాజీ గవర్నర్ కే.రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని భారత ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు కొనియాడారు. రాగ సప్త స్వరం సాంస్కృతిక సంస్థ, టి.సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్ అధ్వర్యంలో ఈరోజు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు బహుకరించారు. ఈ సమావేశంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రోశయ్యది సుదీర్ఘ రాజకీయ జీవితమని, ఆయననుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మహమూద్ అలీ, ప్రభుత సలహదారు కే.వి.రమణాచారి, టూరిజం శాఖా కార్యదర్శి బుర్రా వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.