మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా జట్టు ఫైనల్స్ చేరడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ మిథాలి రాజ్ సారథ్యం, హరిప్రీత్ కౌర్ అధ్బుత సెంచరీ ఫలితంగా పటిష్టమైన ఆస్ట్రేలియాను సెమీఫైనల్ లో ఓడించారన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి ఫైనల్ లో విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించారు.