మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి లో 100 పడకల వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
రూ.20 కోట్లతో నిర్మించనున్న బాదేపల్లి వైద్యశాల. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడిన మంత్రి. 9 నెలలలోగా వైద్యశాల భవనం ప్రారంభం అయ్యే విధంగా చూడాలని అధికారులకు ఆదేశాలు. సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో రాష్ట్రంలో అద్భుత వైద్యం అందిస్తున్నాం. అన్ని హంగులతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే విధంగా హాస్పిటల్స్ ని నిర్మిస్తున్నాం. బాదేపల్లి హాస్పిటల్ కూడా మంచి వైద్యశాల అవుతుంది. మహబూబ్ నగర్, హైదరాబాద్ తరహా వైద్యం ఇక్కడే అందుబాటులోకి వస్తుంది.
ఎమర్జెన్సీ వైద్యానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి, మరణాంతరం వరకు పార్థివ వాహనాలతో కూడా ప్రభుత్వం వైద్యం సహా అన్ని రకాల పథకాలు అమలు అవుతున్నాయి. గతంలో ఎన్నడూ ప్రభుత్వ సేవలు ఈ విధంగా అందలేదు. ఇన్ని రకాల పథకాలు కూడా అమలు కాలేదు. దేశం మొత్తం తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనను వేనోల్లా హర్షిస్తున్నాయి. కేసీఆర్ కిట్ల పథకం వైద్య రంగానికే ఆదర్శం. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కేసీఆర్ కిట్ల పథకం దోహదపడుతుంది. తల్లీ బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక కేసీఆర్ కిట్ల పథకం.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ని ఆధునికరించాం. అత్యాధునిక పరికారాలని సమకూర్చాము. కార్పొరేట్ స్థాయిలో వైద్యశాలలను తీర్చిదిద్దాం. 40 డియాలిసిస్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. కిడ్నీ బాధితులకు ఎంతో ఊరట నిస్తున్నాం. 20 ICU కేంద్రాల ద్వారా అత్యవసర సేవలను జిల్లా కేంద్రాలకు అందుబాటులో కి తెచ్చాము. క్యాన్సర్ స్క్రినింగ్ ద్వారా ప్రజలకు కాన్సర్ వ్యాధులను గుర్తించి, వైద్యం అందిస్తున్నాం. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా స్క్రినింగ్ చేసి వైద్యం అందిస్తున్నాం. క్యాన్సర్ బాధితులకు ఊరట నిచ్చే పాలియేటివ్ కేర్ సెంటర్స్ ని కూడా జిల్లాకి ఒకటి చొప్పున పెట్టబోతున్నాం. ఇప్పటికే రెండు సెంటర్స్ ప్రారంభించగా అందులో ఒకటి చేవెళ్లలో, మరొకటి మహబూబ్ నగర్ లో పెట్టాం.
దేశంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేని విధంగా గాంధీలో సంతాన సాఫల్య కేంద్రాన్ని మొదలు పెట్టాం. ఉచితంగా ఇంటింటికి కంటి పరీక్షలు, రోగ నిర్ధారణ పరీక్షలు చేసి విదేశాల మాదిరిగా ప్రజల హెల్త్ ప్రొఫైల్ ని సిద్ధం చేయబోతున్నాం. కొత్త మార్చురీ విధానాన్ని ప్రారంభిస్తాం. రాష్ట్రంలోని అన్ని మార్చురీలని ఆధునికరిస్తాం. తెలంగాణ వచ్చి, సీఎం గా కేసీఆర్ ఉన్నందునే ఇన్ని పథకాలు, ఇంత ప్రజా ప్రయోజనం జరుగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జోడెడ్ల లాగా అద్భుతంగా నడుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు