మన ఇల్లు- మన కూరగాయలు పథకం – తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామ్ రెడ్డి
హైదరాబాద్-మన పట్టణ ప్రాంత ఆవాసాలలో పోషక పదార్థముల నిచ్చు కూరగాయలు పెంచే పథకం మన ఇల్లు- మన కూరగాయలు అనే పథకాన్ని ఉధ్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామ్ రెడ్డి చెప్పారు.
సోమవారంనాడు నాంపల్లిలోని ఉద్యానవనశాఖ శిక్షణ కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 30 లక్షల ఇండ్లు ఉన్నాయని కేవలం 5 వేల ఇండ్లలో మిద్దెలపైన మన కూరగాయల పంటలు పండిస్తున్నారని చెప్పారు.మన ఇళ్ళు మన కూరగాయల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి మనిషికి అవసరమైన పోషక పదార్థములైన విటమిన్లు,ఖనిజ లవణలు ,పిండిపదార్థములు ఆరోగ్యమును పరిరక్షించు సహజ రసాయనములను అందించుటలో కూరగాయలు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని ఆయన చెప్పారు. సగటు మనిషికి రోజుకు 280 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పని సరిగా తీసుకోవాలనిఆయన తెలిపారు
.పెరుగుతున్న జనాభా కూరగాయల ఖర్చు పోషక లోపం, పట్టణాలలో స్థలా భావము వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన పురుగు మందుల అవశేషాలు లేని తాజా కూరగాయలు ఇంటి ఆవాసాలలో అందుబాటులో తెచ్చేందుకు ఉద్యానశాఖ చర్యలు చెప్పట్టిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల మొక్కలు ఇస్తే తగిన చర్యలు తీసుకొని కాపాడుతున్నామని చెప్పారు.కొందరు చేస్తున్న ఆరోణలో నిజంలేదని ఆయన ఖండించారు.17 నర్సరీల ద్వారా మొక్కల పెంపకం చేస్తున్నామని తెలిపారు.రైతులకు పండ్ల తోటలపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.మన కూరగాయలలో పోట్ల, గోంగూర, తోటకూర, పప్పు, దోసకాయ, మిర్చి, కాకర, ఉల్లి, ఎల్లిగడ్డలు, టమాట, వంగ, బెండ, బీరకాయ, మెంతికూరర, పాలకూర, ద్రాక్ష,మన మిద్దెల పైన పండించుకోవాలని ఆయన కోరారు.
హైవే రోడ్ల ప్రక్కన చింత, రావి, మర్రి, జువ్వి, వేలగ, ఉసిరి, మామిడి మొక్కలను పెంచాలని కోరారు.
ఈ సమావేశంలో డిప్యూటి డైరెక్టర్ వి.విజయదుర్గప్రసాద్ పాల్గొన్నారు.