మంత్రి కేటీఆర్ ను కలిసిన దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్
దక్షిణ కొరియా గౌరవ హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ గా ఎంపికైన సురేష్ చుక్కపల్లి ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును బేగంపేట క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈరోజు ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేరుగా వచ్చి మంత్రి కేటీ రామారావుని గౌరవ సూచకంగా కలిశారు. సురేష్ కి దక్కిన గౌరవానికి మంత్రి కెటిరామారావు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం – కొరియా మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాల అభివృద్ధి కోసం పూర్తి సహాయసహకారాలు అందిస్తామని సురేష్ మంత్రి కేటీ రామారావుకు తెలిపారు. తాము ఇప్పటికే దక్షిణ కొరియాతో అనేక రంగాల్లో యాక్టివ్ భాగస్వామ్యాన్ని తమ కలిగి ఉన్నామని, ప్రస్తుతం ఏలక్ర్టానిక్స్, టెక్స్టైల్స్ వంటి వివిధ రంగాల్లో పెట్టుబడి కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపిన మంత్రి, వీటి సాఫల్యతకు సహకరించాల్సిందిగా కోరారు. సురేష్ చుక్కపల్లి హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఫీనిక్స్ సంస్థకు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.