పైడిమర్రి వెంకట సుబ్బారావుగారి జయంతి ఉత్సవం
మన భారత జాతీయ పతిజ్ఞ (భారతదేశం నా మాతృ భూమి) రచయిత కీII శేII పైడిమర్రి వెంకట సుబ్బారావు. వారి జయంతి ఉత్సవం రవీంద్రభారతి మొదటి అంతస్తులో సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి, శ్రీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయులు శ్రీ పాశం యాదగిరి, కవి, కథా రచయిత శ్రీ ఎలికట్టే శంకర్ రావు, పైడిమర్రి వారి కుటుంబ సభ్యులు పైడిమర్రి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
వారు బహుభాషా వేత్త. నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. సుబ్బారావుగారు తెలుగు, హిందీ, ఆంగ్లం, సంస్కృతం, అరబిక్ భాషల్లో నిష్ణాతులు. పైడిమర్రి ప్రతిజ్ఞను రచించి 55 సంIIలు పూర్తి అవుతుంది. 1964లో జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించగా, 1965 జనవరి 26 నుంచి మన భారత దేశమంతటా ప్రతిజ్ఞ చదువుతున్నారు. వారు ఎన్నో కవితలు, నాటకాలు, కథలు రచనలు రాశారు. అరబ్బిక్ అనువాదాలు కూడా చేశారు.
ప్రతిజ్ఞ అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు : తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి.
తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ వ్యక్తి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞ రాశారు,మరుగున పడిన ఎన్నో విషయాలను, ఎంతోమంది ప్రముక వ్యక్తుల గురించి అచ్చమాంబ గారి నుంచి పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి వరకు వారి కృషిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది అని అన్నారు.
పైడిమర్రి గారి స్పూర్తి, ప్రతిజ్ఞని ప్రజల్లోకి తీసుకెళ్లటమే నిజమైన నివాళి: దేశపతి శ్రీనివాస్.
దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సమాజహితం కోసం చేసేవారు పేరు కోరుకోరు, తెలంగాణ వారికి కీర్తి కాంక్ష తక్కువ అని అన్నారు.
ఓనమాలు ఎంత గొప్పవో పైడిమర్రి గారు రచించిన ప్రతిజ్ఞ అంతా గొప్పది : మామిడి హరికృష్ణ.
మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ ప్రతిజ్ఞ “భారతదేశం నా మాతృ భూమి, భారతీయులందరూ నా సహోదరులు” అయ్యాక పాఠశాలలో విద్యార్థులు ఓనమాలు ప్రారంభిస్తారు అని అన్నారు.
ఈ జయంతి ఉత్సవం అలాగే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న భాషా సాంస్కృతిక శాఖకు అభినందనలు తెలిపారు సీనియర్ పాత్రికేయులు శ్రీ పాశం యాదగిరి.
పైడిమర్రి గారి కుమారుడు శ్రీ సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారి నాన్నగారి (పైడిమర్రి) పేరును పుస్తకాల్లో ప్రతిజ్ఞ కింద ముద్రించారు, అలాగే 5వ తరగతిలో నాన్నగారి జీవితచరిత్రని పాఠ్యాంశంగా పెట్టారు ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముక కవి, కథా రచయిత ఎలికట్ట శంకర్ రావు గారు పైడిమర్రి జీవిత విశేషాలను పరిశోధన చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డా. నందిని సిధారెడ్డి, శ్రీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ, సీనియర్ పాత్రికేయులు శ్రీ పాశం యాదగిరి, కవి, కథా రచయిత శ్రీ ఎలికట్టే శంకర్ రావు, పైడిమర్రి వారి కుటుంబ సభ్యులు కొడుకులు – కోడళ్ళు (శ్రీ సుబ్రమణ్యం – శ్రీమతి శేషకుమారి, శ్రీ రాంబాబు – శ్రీమతి దుర్గారాణి), కూతురు – అల్లుడు (శ్రీమతి నాగలక్ష్మి – శ్రీ వేంకటేశ్వర శర్మ), శ్రీ రాంప్రదీప్, సాంస్కృతిక శాఖ అకౌంట్ ఆఫీసర్ శ్రీమతి వసుంధర, సిబ్బంది, రవీంద్రభారతి సిబ్బంది, తదీతరులు పాల్గొన్నారు.