భక్తుల హర్షద్వానాల మద్య బాలాపూర్ గణపతి నిమజ్జనం
హైదరాబాద్ సెప్టెంబర్ 5(ఎక్స్ ప్రెస్ న్యూస్): నగరంలోని బాలాపూర్ గణపతి నిమజ్జనం పూర్తయ్యింది. ట్యాంక్బండ్పై క్రేన్ నం.8 వద్ద గణేష్ నిమజ్జనం నిర్వహించారు. ఉదయం నుంచి వైభవంగా బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర నిర్వహించారు. అంతకుముందు నిర్వహించిన వేలం పాటలో బాలాపూర్ లడ్డూను రూ.15.60 లక్షలకు జూబ్లీహిల్స్కు చెందిన నాగం తిరుపతిరెడ్డి దక్కించుకున్నారు.ఈ విగ్రహం నిమజ్జనంతో ప్రధాన విగ్రహాల నిమజ్జనాలు పూర్తయ్యింది. ప్రధానమైన ఖైరతాబాద్ విగ్రహాన్ని మధ్యాహ్నం 2 గంటలకు ట్యాంక్బండ్ వద్ద నిమజ్జనం చేయగా.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బాలాపూర్ గణేషుడు గంగమ్మఒడికి చేరాడు. మరోవైపు ట్యాంక్బండ్కు నగరంలోని పలు ప్రాంతాల నుంచి గణపతి విగ్రహాలు ఇంకా తరలివస్తున్నాయి. నిమజ్జనాలను వీక్షించేందుకు జనం పెద్దఎత్తున ట్యాంక్బండ్ పరిసరాలకు చేరుకున్నారు.కాగామరోవైపు నగరంలో జరుగుతున్న గణేశ్ నిమజ్జనాలను హోంమంత్రి నాయిని పరిశీలించారు. అధికారులతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరి నిమజ్జనాలు జరుగుతున్న తీరును విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు వివరించారు.