బాదేపల్లి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
మిట్ట మధ్యాహ్నం, పట్టపగలు ఎర్రటి ఎండలో పట్టణంలో పనులను పరిశీలించిన మంత్రి. పనుల నాణ్యత, ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేసిన మంత్రి. పోస్ట్ ఆఫీస్ ఎదుట రోడ్డు డివైడర్ల పనుల నాణ్యత సరిగా లేదని తేల్చిన మంత్రి. తగు నాణ్యత ప్రమాణాలను పాటించాలనినాణ్యతా ప్రామాణాలను పాటించని వాళ్ల మీద కఠిన చర్యలుంటాయని హెచ్చరిక. ఆయా పనులు తిరిగి చేయాలని ఆదేశాలు. ప్రజాపయోగ పనుల్లో రాజీ పడొద్దని సంబంధిత అధికారులకు సూచన.
మంత్రి వెంట బాదేపల్లి కమిషనర్ సునీత, ఇంజనీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉన్నారు.