ఫలక్నుమా ప్యాలెస్ సాంస్కృతిక వైభవానికి చిహ్నమని ఆఫ్రికా జర్నలిస్టుల బృందం ప్రశంస
శనివారం నాడు ఆఫ్రికా జర్నలిస్టుల బృందం తమ పర్యటనలో భాగంగా ఫలక్నుమా ప్యాలెస్ ను సందర్శించారు. ప్యాలెస్ అధికారులు వీరికి స్వాగతం పలికారు. ప్యాలెస్ నిర్మాణం, నైపుణ్యం చూసి అబ్బురపడ్డారు.
ఫలక్నుమా ప్యాలెస్ ను 1884లో శంఖుస్థాపన చేయగా 1893 నాటికీ నిర్మాణం పూర్తి అయిందని, చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీది నుండి చుస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయని అన్నారు. ఈ ప్యాలెస్ నాటి నిజాం పాలకుల రాజసానికి గుర్తుగా నిలుస్తుందని, ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ ప్యాలెస్ హోటల్ గా ఎంపిక అయిందని ఫలక్నుమా ప్యాలెస్ విశిష్టతలను వివరించారు.
అంతకుముందు ఆఫ్రికా జర్నలిస్టుల బృందం జి.ఎం.ఆర్. ఏరో స్పేస్ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి బి. రాజమౌళి, ఉప సంచాలకులు వెంకటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.