తెలంగాణ రాష్ట్రంలో దళిత యువతీ యువకులకు వృత్తి విద్య నైపుణ్యం కోర్సులలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో బాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం ప్రసిద్ధ NI-MSME తో ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో ని రాష్ట్ర విద్యుత్ మరియు యస్ సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చాంబర్ లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర యస్ సి అభివృద్ధి కార్పొరేషన్ యం డి లచ్చిరామ్ భూక్య NI-M SME ముఖ్య కార్యనిర్వాహాణాధికారీ ఎన్.శ్రీనివాస్ లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.
రాష్ట్ర విద్యుత్ మరియు యస్ సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో రాష్ట్ర యస్ సి అభివృద్ధి శాఖా కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్ NI-M SME డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ చతుర్వేది,ప్రోగ్రాం డైరెక్టర్ అంకిత్ భట్నాగర్ యస్ సి కార్పొరేషన్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు …..అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ… దళితుల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దళితుల సమస్యలు, పరిష్కారాలపై సీఎం కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉంది. సీఎం నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెటాం. కేవలం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ప్రతి కుటుంబాన్ని దారిద్య్ర రేఖ ఎగువకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. అన్నింటికీ మూలమైన విద్య విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాం, 150 కొత్త గురుకులాలు ప్రారంభించాం. భూపంపిణీ 10 వేల ఎకరాలకు పైగా ఇచ్చాం. స్వయం ఉపాధి పథకాల కోసం లక్ష మందికి పైగా సహాయం చేశాం. నైపుణ్యం విషయమై దేశం వెనకబడి ఉంది, నైపుణ్యాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఒప్పందం చేసుకొని దళిత యువతకు లబ్ది చేకూరుస్తున్నాం. వెయ్యి మందికి పైగా యువతకు శిక్ష ఇచ్చి ఉద్యోగాలు పొందేలా చూశాం. 200 మంది దళిత యువతకు యానిమేషన్, డిజిటల్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చేనెడుకు నిమ్స్ మే తో ఒప్పందం కుదుర్చుకున్నాం అని తెలిపారు.