ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన పథకాన్ని తెలంగాణలో సూర్యాపేటలో లాంఛనంగా ప్రారంభించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
రాష్ట్రంలో నిరుపేదల వంటింటి కష్టాలకు తెరపడింది. పొగచూరిన వంట నుంచి విముక్తి కల్పిస్తూ ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన తెలంగాణలో లాంఛనంగా ప్రారంభమైంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సూర్యాపేటలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పథకం లబ్ధిదారులకు ధర్మేంద్ర ప్రదాన్ గ్యాస్ స్టవ్, ఇతర పత్రాలు అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తదితర బిజెపి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.