పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కమీషనర్ వి. శివ కుమార్ గారు మాట్లాడుతూ 21 అక్టోబర్ 1959 లో యస్ఐ కరీంసింగ్ మరియు 20 మంది జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్రింగ్ విధులు నిర్వహిస్తుండగా చైనా ఆర్మీ వారి పై దాడి చేసి10 మందిని హతమార్చినది. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్-21 న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుండి ప్రారంభమైనది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం అమరులైన పోలీసుల జీవితాలనే మనం మార్గదర్శకంగా, ఆదర్శంగా మలుచుకుంటు ప్రజాసేవకు, ప్రజల ధన,మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావడం. ఉగ్రవాదం, తీవ్రవాదం,మతతత్వం వంటి విఛ్ఛిన్న కర శక్తులతో నేరాలకు గోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించింది. ఈ దశలో త్యాగాలకు భయపడకుండా వెనుకడుగు వేయకుండా రెట్టించిన సమరోత్సాహంతో అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించాలి. పోలీసులు త్యాగం చేయని రోజు అంటు ఉండదు. సెలవులు, పండుగ దినాలు, అధిక గంటలు పని చేయవలసి రావడం, ఆరోగ్యన్ని సైతం నిర్లక్ష్యం చేసి, అవిశ్రాంతంగా పని చేయడం వంటివి కూడా త్యాగలే, పోలీసుల తప్పులు ప్రచారం అవుతున్నంతగా వారి త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవడం లేదు. త్యాగాలు చేసే వారికి ఇంకా గుర్తంచడం లేదు. ఆరోజు కోసం మనమంతా ఎదురుచూద్దాం. ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో (383) వీరమరణం పోందిన వారందరికీ మనము అందరము శ్రద్దాంశాలి ఘటిస్తున్నాము. గతములో సిద్దిపేట జిల్లా పరిధిలో విధి నిర్వహణలో వీరమరణం పోందిన త్యాగమూర్తులు 1. యాదగిరి సి.ఐ.( రామవరం హుస్నాబాద్), 2. జాన్ విల్సన్ యస్ఐ ( రామవరం హుస్నాబాద్), 3.రాజగోపాలచారి యస్ఐ (దౌల్తాబాద్), 4. చంద్రయ్య హెచ్.సి. 156,( దౌల్తాబాద్), 5.ప్రసాద్ పిసి, 2049 గజ్వెల్, 6. రాంమూర్తి పిసి 2173, కొండాపూర్ మద్దూర్, 7.ప్రకాష్ సింగ్ పిసి, 956, సింగరాయికొండ కోహెడ, 8. సి. నర్సింహా ( అక్కన్నపేట్), పిసి ( సిఅర్ పి యఫ్) చత్తీస్ గఢ్ వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని మరియు వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను సర్వస్వం లబింపచేయడం,అయా కుటుంబాలకు మానసిక బలాన్ని అందించటమే పోలీసు అమర వీరులకు అందించే నిజమైన నివాళి. పోలీసులు చేస్తున్న అత్యున్నత త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా ప్రముఖ దిన పత్రికలలో ప్రకటనలు బ్యానర్లు.మరియు కమీషనరేట్ నందు, పోలీసు స్టేషన్ లలో ఓపెన్ హౌజ్ కార్యక్రమము, వ్యాసరచన పోటీలు, పేంటింగ్, 2 కే రన్ లు, రక్త దాన శిబిరాలు, క్రికెట్ పోటీలు, వాలీబాల్, కబడ్డీ పోటీలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు జరిగినవి. కమీషనర్ గారు అమరుల కుటుంబ సభ్యులను పేరు పేరు నా పరామర్శించారు తరువాత వారిని సన్మానించారు.
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జరిగిన పెయింటింగ్, వ్యాసరచన పోటీలలో గెలుపొందన విద్యర్థని విద్యార్థులకు సర్టిఫికేట్ ఆఫ్ డిస్టింక్షన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మాకర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ బాబు, బి.సి.వెల్ఫేర్ అధికారి రాంరెడ్డి, జిల్లారెవిన్యూఅధికారి చంద్రశేఖర్, ఆర్.టి.ఒ విజయభాస్కర్ రెడ్డి, అడిషనల్ సిపి బాపురావు, సిద్దిపేట్ ఎసిపి నర్సింహ్మా రెడ్డి, ఇస్పెక్టర్స్ నందిశ్వర్ రెడ్డి, ఆంజనేయులు, యస్ బి ఇన్స్ ఇస్పెక్టర్ ప్రసాద్, ఆర్.ఐ కిషన్ రావు, సిసిఅర్ బి ఇస్పెక్టర్, దయాకర్ రెడ్డి సిసియస్ ఇస్పెక్టర్ రామకృష్ణ, యస్ఐలు రాజులు, గోపాల్ రావు, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, ముఖద్ పాషా, మరియు ఎ.ఆర్. సివిల్ పోల…