పెద్దపల్లిలో ఆంద్ర భూమి రిపోర్టర్ గా పనిచేస్తూ చనిపోయిన ఎం. నారాయణ మూర్తి కుటుంబానికి చేయూత.
చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబంలో పెళ్లీడుకు వచ్చిన కూతురికి 3 లక్షల ఆర్ధిక సహాయం అందిస్తానన్న ముఖ్యమంత్రి ఆచరణలో నిరూపించారు. నారాయణమూర్తి కూతురు వివాహం ఫిబృవరి 19న పెద్దపల్లి లో జరిగింది. సమయాభావం వల్ల ఆరోజు అందజేయలేకపోయిన 3 లక్షల చెక్ ను ఈరోజు మంత్రి కెటిఆర్ ఆయన కుటుంబానికి అందజేశారు. ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.