జహీరాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
జహీరాబాద్ నవంబర్ 18: రాష్ట్ర మంత్రి టీ. హరీశ్రావు జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. కోహీర్, జహీరాబాద్, ఝరాసంగం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు ప్రారంభించారు. జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలో 255 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ చెక్కులు, కల్యాణలక్ష్మి పథకంలో326 చెక్కులు మంత్రి హరీశ్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఫారురుద్దీన్, స్థానిక ఎమ్మెల్యే గీతారెడ్డి, జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి జహీరాబాద్ మండలంలోని బుర్థిపాడు గ్రామం వద్ద వాగు పై కొత్తగా నిర్మించే బ్రిడ్జికి భూమి పూజ చేసారు. ఝరాసంగంలో రూ3 కోట్ల వ్యయంతో కాకర్వాడ శివారులో నిర్మించిన గోదాంను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా కోహీర్లోని సజ్జాపూర్ శివారులో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు.