పంద్రాగస్ట్ వేడుకలకు ముస్తాబైన గోల్కొండ
హైదరాబాద్ ఆగష్టు 14(ఎక్స్ ప్రెస్ న్యూస్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చారిత్రక గోల్కొండ కోట అన్నిహంగులతో ముస్తాబైంది. విద్యుత్దీప కాంతులతో వారసత్వ సంపద ధగధగలాడుతున్నది. మరోవైపు కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీస్శాఖ భారీబందోబస్తు ఏర్పాటుచేసింది. వేడుకలు జరిగే హైదరాబాద్లోని గోల్కొండ కోట పరిసరాల్లో ఐదువేల మంది పోలీసులను మోహరించింది. ఇందుకు పోలీసుశాఖలోని అన్ని విభాగాల సేవలను వినియోగిస్తున్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు. వేడుకలకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చే రూట్లో ఆదివారం పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు. సందర్శకులకు ఎలాంటిఇబ్బందులుతలెత్తకుండాచర్యలుచేపడుతున్నారు.పంద్రాగస్టు వేడుకలకు చారిత్రక గోల్కొండకోటను అన్ని రకాల హంగులతో ముస్తాబు చేస్తున్నారు.
మంగళవారం నిర్వహించే కార్యక్రమాలపై రిహార్సల్స్ జరుగుతున్నాయి. భద్రత కార్యక్రమాల రిహార్సల్స్తోపాటు పోలీసు, వివిధ భద్రత బలగాలు కవాతు నిర్వహించాయి. విద్యార్థులు కూడా పలు కార్యక్రమాలపై రిహార్సల్స్ చేశారు. నిఘావర్గాల సూచనల మేరకు అన్నిరకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు సీనియర్ పోలీస్ అధికారులు చెప్పారు. అదనపు డీజీపీ (శాంతి-భద్రతలు) అంజనీకుమార్ నాలుగురోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గోల్కొండకోట వద్ద ఉంటూభద్రతసిబ్బందికిపలుసూచనలుచేస్తున్నారు.పంద్రాగస్టు వేడుకలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెళ్లేమార్గంలో ఆదివారం రిహార్సల్స్ నిర్వహించారు. ప్రగతిభవన్ నుంచి గోల్కొండకోట కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. దారి పొడువునా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించారు. ఆయాప్రాంతాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు కూడా పలుసూచనలు చేశారు. పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వర్రావు స్థానిక పోలీసులతో సమావేశమై భద్రతపై అన్నిరకాల సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతుండగా మరోవైపు సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. భద్రత నేపథ్యంలో పోలీసు, పురావస్తుశాఖల అధికారులు భేటీ అయ్యారు. పోలీసుల సూచనలకు అనుగుణంగా పురావస్తుశాఖ అధికారులు సహకరిస్తూ, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కాగా గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సం దర్భంగా మంగళవారం ఉదయం 7 గంటల నుం చి మధ్యాహ్నం12 గంటల వరకు రాందేవ్గూడ నుంచి గోల్కొండ కోట రోడ్డును మూసివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి తెలిపారు. వేడుకల నేపథ్యంలో గోల్కొండ, ఆ పరిసర ప్రాం తాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు చేప ట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, వేడుకలకు హాజరయ్యే ప్రజలు హ్యాండ్ బ్యాగ్లు, బ్రీఫ్కే సులు, కెమెరాలు, టిఫిన్స్ లాంటి వస్తువులను తీసుకురావద్దని ఆయన సూచించారు. ఈ రక మైన వస్తువులను వెంట తెచ్చుకుంటే వారిపై చర్య లు ఉంటాయని సీపీ తెలిపారు.
– ఏబీసీ స్టిక్కర్స్ ఉన్న వాహనాలు ఉదయం 7.30గంటల నుంచి 10 గంటల వరకు, పరేడ్ ప్రారంభానికి ముందు మాత్రమే రావాలి. ఆ తర్వాత తిరిగి అదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది.
-సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే ఏబీసీ పాస్ కలిగిన వాహనాలను వయా రేతిబౌలి జం క్షన్, నాలా నగర్ జంక్షన్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసు కొని, బాలిక భవన్, ఆంధ్ర ఫ్లోర్ మిల్స్, ప్లె ఓవర్, లంగర్హౌస్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రాందేవ్గూడ రైట్ టర్న్తో మాకై దర్వాజ నుంచి గోల్కొండ పోర్ట్కు చేరుకోవాలి. అక్కడ నుంచి వారికి కేటా యించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలి. ఎ కారు పాస్ కల్గిన వాళ్లు, గోల్కొండ కోట గేటు ఎదుట మెయిన్ రోడ్డులో ఫతే దర్వాజ రోడ్డులో, బి పాస్ కల్గిన వాహనాలను గేట్ ముందు నుంచి కింది వైపుకు వచ్చి (యూసుఫ్ హోటల్ ముందు), బస్టాప్లలో పార్కు చేయాలి. సీ కారు పాస్ హోల్టర్లు గోల్కొండ ఏరియా దవాఖాన ప్రాంతంలోపార్కుచేయాలి.
డీఈఎఫ్ కారు పాసులు కలిగిన వాహన దా రులు సేవన్ టూంబ్స్ నుంచి షేక్పేట్ నాలా, టోలీచౌక్ మీదుగా పోర్టుకు వెళ్లాలి. రామ్దేవ్గూడ, మాకీ దర్వాజ రూట్లలో అను మతించరు. డీ కారు పాస్ హోల్డర్స్ తమ వాహ నాలను ఏరియా దవాఖాన వద్ద ఆపి, పార్కింగ్ కోసం ప్రియదర్శినీ స్కూల్కు పంపించాలి. ఇ, ఎఫ్ కారు పాసులు కలిగిన వారు ఓవైసీ జీహెచ్ ఎంసీప్లేగ్రౌండ్లోపార్కుచేయాలి.
ఇ, ఎఫ్ వాహనాలు గోల్కొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని హాకీ, ఫుట్బాల్ గ్రౌండ్లో పార్కు చేసుకోవచ్చు.
వేడుకలకు హాజరయ్యే సాధారణ ప్రజలు తమ వాహనాలను హుడా పార్కు, సెవన్ టూంబ్స్ వద్దపార్కుచేయాలి.
వేడుకలు పూర్తయిన తరువాత ఏబీసీ కారు పాసు హోల్డర్స్ మాకై దర్వాజా, రాందేవ్గూడ వైపు నుంచి బయటకు వెళ్లిపోవాలి, డీ కారు పాసు హోల్డర్స్ బంజారా దర్వాజ, సెవెన్ టూం బ్స్ వైపు వెళ్లాలి. ఇ, ఎఫ్ పాస్ హోల్డర్స్ జమాల్ దర్వాజ, గోల్ప్ క్లబ్, సెవెన్ టూంబ్సు, సాధారణ పౌరులు ఫతే దర్వాజ, జమలై దర్వాజ వైపు నుం చి వెళ్లాలి.
పాస్ హోల్డర్స్ పాసులను ఎడమ వైపు విండో స్క్రీన్కు అతికించాలని ఆయన సూచించారు.
రాజ్భవన్రోడ్డులో…
గవర్నర్ రాజ్భవన్లో మంగళవారం సాయం త్రం 5.30 గంటలకు ఇచ్చే తేనేటి విందు సం దర్భంగా రాజ్భవన్ రోడ్డులో సాయంత్రం 4.30 గంటల నుంచి నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు కమిషనర్ మహేం దర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సోమాజిగూడ రాజీవ్గాంధీ విగ్రహం వరకు రోడ్డుకు రెండు వైపులా వెళ్లే సాధారణ వాహనాలు ప్రత్యామ్నా య రూట్లలో వెళ్లాలి.
వీవీఐపీఎస్ లైన తెలంగాణ, ఏపీ సీఎంలు, డిప్యూటీ సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టిస్, శాసన మండలి చైర్మన్లు, స్పీకర్లు, కేంద్ర మంత్రులు, రెండు రాష్ర్టాల మంత్రులు. వీరి వాహనాలు గేట్ నెం.1 నుంచి రాజ్భవన్లోకి వెళ్లి, గేట్-2 నుంచి బయటకు రావాలి. ఈ వాహనాలను రాజ్భవన్లోపలపార్కుచేయాలి.
పింక్ కారు పాసు కలిగిన ఇతర అతిధులు, గేట్ నెం.3 నుంచి లోపలికి వెళ్లి, లోపలే పార్కు చేయాలి. అదే గేటు నుంచి బయటకు వెళ్లాలి. వైట్ కారు పాసు కలిగిన వారు గేట్ నెం.3 నుంచి ప్రవేశించి, వారి వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, ఎంఎంటీఎస్ సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసెడిన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదరుగాసింగిల్లైన్లోపార్కింగ్చేసుకోవాలి.
సికింద్రాబాద్లో…
పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకల సందర్భంగా తివోలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ను బ్రూక్బండ్, ఎన్సీసీ జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఈ ఆంక్షలు ఉదయం 8 నుంచి 9గంటల వరకు అమలులో ఉంటాయి.