నేషనల్ ఎనర్జీ కంజర్వేటివ్ అవార్డ్ 2017ను గెలుచుకున్న సి.ఆర్.ఐ. పంప్స్
భారత ప్రభుత్వం నేషనల్ ఎనర్జీ కంజర్వేషన్ అవార్డ్ ను విద్యుత్తు మరియు న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ మంత్రివర్యులు రాజ్ కుమార్ సింగ్ గారి చేతుల మీదుగా అందుకుంటున్న సి.ఆర్.ఐ. గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి.సెల్వరాజ్
హైదరాబాద్ జనవరి 8: సి.ఆర్.ఐ. పంప్స్, మరో సారి నేషనల్ ఎనర్జీ కంజర్వేటివ్ అవార్డ్ 2017ను గెలుచుకొంది. దీని ద్వారా, ఎనర్జీ సామర్థ్యం కలిగిన పంప్ సెట్ల తయారీ రంగంలో అగ్రగామిగా ప్రపంచానికి నిరూపించబడింది. సి.ఆర్.ఐ. మొత్తం పంప్ కేటగిరీలో ఈ అవార్డుని గెలుచుకున్న ఏకైక కంపెనీగా నిలిచింది. భారత ప్రభుత్వం నేషనల్ ఎనర్జీ కంజర్వేషన్ అవార్డ్ ను విద్యత్తు సచివాలయం, అందజేసింది.
ఢిల్లీలో శ్రీ జి. సెల్వరాజ్, సి.ఆర్.ఐ. గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ అవార్డుని గౌరవనీయ రాష్ట్ర (ఐసి) విద్యుత్తు మరియు న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ మంత్రివర్యులు రాజ్ కుమార్ సింగ్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 వ తేదీన బిఇఇ ద్వారా నేషనల్ ఎనర్జీ కంజర్వేషన్ డే ఉత్సవాలు జరుపుకొన బడుతాయి. ఈ దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకొనుట మరియు ఉత్సవం జరుపుకొనుట కొరకు, విద్యుత్తు సచివాలయం, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ ఎనర్జీ కంజర్వేషన్ అవార్డ్ ఇవ్వబడుతుంది. అత్యధిక ఎనర్జీ సామర్థ్యం కలిగిన బిఇఇ 5 స్టార్ లేబుల్ కలిగిన ఉపకరణములు ఈ అవార్డుకు యోగ్యత కలిగిన ఉత్పాదనలు అవుతాయి.
ఈ సందర్బంగా సి.ఆర్.ఐ. గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి.సెల్వరాజ్, మాట్లాడుతూ“సి. ఆర్. ఐ. తమ విజయ పరంపరల కిరీటంలో మరొక కలికి తురాయిని అని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా సి.ఆర్.ఐ. అత్యాధునిక డిజైన్లు మరియు సాంకేతికతతో ఎనర్జీ సామర్థ్యం కలిగిన పంప్ సెట్లు అందించుటకు కృషి చేసిందన్నారు.ఈ కారణం చేత, వినియోగదారులు, పర్యావరణం, సమాజం మరియు చివరగా పూర్తి దేశానికి నిరంతరం అవిశ్రాంతంగా ప్రయోజనాలు చేకూరుస్తూ, అత్యంత అరుదైన సహజ సంపద వనరులను సంరక్షించే లక్ష్యసాధనను కొనసాగిస్తునట్లు తెలిపారు.
ఈ సమయంలో, ఈ కార్యసాధన మరియు ఈ మైలు స్టోన్ ని సాధించుటలో మా వినియోగదారులు, భాగస్వాములు, నిబద్ధతతో పనిజేసే మా ఉద్యోగులు మరియు అధికార వర్గాల విశ్వాసం మరియు అండదండలందించిన సిబ్బందికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.