నేటి నుంచి రవీంద్రభారతిలో “తెలంగాణ యువ నాటకోత్సవం-4”
నేటి నుంచి రవీంద్రభారతిలో “తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర)” మరియు “తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ” సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు “తెలంగాణ యువ నాటకోత్సవం – 4” ప్రదర్శన
తెలంగాణ యువ నాటకోత్సవం – 4 నాటికల వివరాలు
తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర), తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ
సంయుక్త ఆధ్వర్యంలో
తెలంగాణ యువ నాటకోత్సవం – 4
27,28,29,30 డిసెంబర్, 2018
రవీంద్ర భారతి, హైదరాబాదు, సా. 5.30 ని.ల. నుండి రాత్రి 9.00 గం.ల వరకు
27.12.2018
1. అన్న ఆర్ట్స్, వనపర్తి
అసుర
అంగుళీమాలుడు అతిక్రూరుడు. అంధఃవిశ్వాసంతో లేని శాపవిమోచన కోసం వెయ్యి మంది పుణ్యపురుషులను చంపబూనిన ఆ కిరాతకుడిలో బుధుడి బోధనలు ఎలాంటి జ్ఞానాన్ని కలిగించాయన్నదే ఈ నాటిక కధాంశం.
రచన, దర్శకత్వం
వినోద్ కుమార్. పి
27-12-2018 | 6:00 P.M
2.తెలంగాణ రంగస్థల కళాకారుల వేదిక, వరంగల్
వైద్యో నారాయణో ‘హరీ…!’
లేని రోగాలు అంటగట్టి జబ్బుతో వచ్చిన రోగిని డబ్బుగా భావించే వైద్య శిఖండులు, కమీషన్లకు కక్కుర్తి పడి రోగులను బలిపీఠం ఎక్కించే ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, నకిలీ మందులమ్మి రక్తంకూడు తినే మెడికల్ షాపుల ఓనర్లు.. ఒక బక్కరైతు ప్రాణాన్ని హరించిన ఉదంతం ఈ నాటిక కధాంశం.
రచన వడ్లపల్లి నర్సింగరావు
దర్శకత్వం తిరుమలయ్య. కె
27 – 12 – 2018 | 7:00 P.m
*****
28.12.2018
3. శ్రీ విజయ భారతీ నాట్యమండలి(సురభి), హైదరాబాద్
సదారమె అను కాంతిమతి
20వ శతాబ్ది మొదట్లో వెలసిన వృత్తి నాటక సమాజాల్లో కర్ణాటకలోని “గుబ్బి” కంపెనీ ఒకటి. తడకలూరి కుప్పుస్వామి రాసిన “సదారమె” నాటకం వారికెంతో పేరు తెచ్చింది. దీనినే సురభి వారికోసం తెలుగులో “కాంతిమతి”గా శ్రీ రాములు సచిదానంద శాస్త్రి రాయడం జరిగింది. హాస్యప్రధానంగా సాగే ఈ నాటకాన్ని ఈ నాటకోత్సవంలో అందరూ స్త్రీలే ప్రదర్శించడం విశేషం.
నాటకీకరణ హేమ మానస
నిర్వహణ శ్యామల రేకందర్
దర్శకత్వం హారిక వర్మ రేకందర్
4.మిర్రర్ థియేటర్, పెద్దపల్లి
జిహాద్
జిహాద్ అంటే పవిత్రయుద్ధం. కానీ మతోన్మాదుల చేతుల్లో అదొక మారణాయుధంగా మారిపోవడం విచిత్రం. సోషల్ మీడియాలో వచ్చే సందేశాల ప్రభావంతో తీవ్రవాదిగా మారుతాడు ఒక యువకుడు. ఆలోచనలకు ఆచరణకు మద్య తేడాను గ్రహించలేని విజయస్సులో ఆ యువకుడు ఎం చేసాడన్నదే ఈ నాటిక ముఖ్యాంశం.
రచన, దర్శకత్వం సాంబశివమూర్తి . బి
28 – 12- 2018 | 7:00 P.M
5. విశ్వహిత కళాకేంద్రం, హైదరాబాద్
చరమస్థలం
ఇర్లాండ్ లో జన్మించిన విలియం బట్లర్ ఈట్స్(1865) కవిగా, నాటక రచయితగా 1923 నోబుల్ బహుమతిని పొందారు. సాహిత్యకారుడిగా పేరుపొందిన ఈట్స్ నాటకాలు సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తాయి. వ్యసనాలకు బానిసలయిన మూడుతరాల వ్యధను ఈ నాటికలో కవితాత్మకంగా వివరించడం ప్రధానంగా కనిపిస్తుంది.
మూలం: విలియం బట్లర్ ఈట్స్
స్వేచ్చానువాదం, దర్శకత్వం సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి
28 – 12 – 2018 | 8:00 P.M
29.12.2018
6. సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్
అసురదేవోభవ
చెయ్యని నేరానికి చట్టం ముందు నేరస్తుడిగా నిలబడ్డ కొడుకును కాపాడుకోవలసిన కన్నతండ్రి ‘తన కొడుకు నేరస్తుడే’ అని సాక్ష్యానికి ముందుకు రావడం విచిత్రం. చట్టం దృష్టిలో సాక్ష్యాలు రుజువులు మాత్రమే నేరనిరూపనకు ప్రాతిపాకలయినపుడు ఆ కొడుకుకు కోర్టు ఏ శిక్ష విధించిందన్నది ఈ నాటిక కధాంశం.
రచన నర్సయ్య బోయపల్లి(నిర్మల్)
దర్శకత్వం (మంజునాథ్ .బి)
29 – 12 – 2018 | 6:00 P.M
7. దర్శన్ ఆర్ట్స్, హైదరాబాద్
ద షో మస్ట్ గో ఆన్
తెలుగులో సినిమాయే రాని కాలంలో ముంబై వెళ్లి హిందీ చిత్రసీమలో కథానాయకుడిగా ఆ నాటి సూపర్ స్టార్ లలో ఒకడిగా తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టిన ఘనుడు పైడి జైరాజ్. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు బాలీవుడ్ లో అత్యధిక కాలం పనిచేసిన కళాకారుడిగా గిన్నిస్ రెకార్డ్ సాధించిన పైడి జైరాజ్ జీవిత గాఢ స్పూర్తితో ఈ నాటిక రూపొందించబడింది.
రచన మనోజ్ అవుదుర్తి
కాన్సెప్ట్ దర్శకత్వం సంజీవ్ పటేల్
29 – 12 – 2018 | 7:00 P.M
8. మంచు థియేటర్, హైదరాబాద్
ఓ ప్రేమ.. ఓ దొంగ
ఓ ఫ్రెండ్ దగ్గర అప్పుచేసి మరీ కార్తిక్ తన లవర్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికి అర్దరాత్రి ఆమె ఇంటికి వెళతాడు. అదే సమయానికి అదే ఇంట్లోకి ఒక దొంగ ప్రవేశిస్తాడు. ఇంతలో కరెంట్ కట్. ఆ చీకట్లో ఎవరికేది దొరికిందన్నదే కడుపుబ్బా నవ్విస్తూ హాస్యభరితంగా సాగే ఈ నాటిక కధాంశం.
9. జాబిల్లి కల్చరల్ సొసైటీ, నిజామాబాద్
తెగారం
1918లో నంది నాటకోత్సవాల్లో ఉత్తమ నంది అవార్డు సాధించిన నాటకం ఇది. ఎల్లవ్వ ఒక శివసత్తి, కానీ తన కూతురు లలిత శివసత్తిగా మారడాన్ని వ్యతిరేకిస్తుంది. తల్లికి ఊర్లో జరిగే మన్నన చూసి లలిత దొరైన్ట్లో పూనకాలు ఊగుతుంది. విషయం తెలిసిన ఊరిపెద్దలు ఈ ఏడూ బోనాలు లలిత చేత జరపనిర్ణయిస్తారు. ఆమెను బలవంతంగా శివసత్తినిజేసి ఊరేగింపుగా వస్తుంటే ఆ మూఢాచారాన్ని ఆపడానికి ఎల్లవ్వ ఏం చేసింది అన్నదే ఈ నాటకం కధాంశం.
రచన పెద్దింటి అశోక్ కుమార్
దర్శకతం డా. మల్లేష్ బలాష్టు
30 – 12 – 2018 | 6:00 P.M
10. సహృదయ కల్చరల్ గ్రూప్, సికింద్రాబాద్
అంబల్ల బండ
నటి దొరల అకృత్యాలను తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. నాటకాలుగా ప్రదర్శించుకుంటారు. అలాంటి కథనే ఇది. కంటికి బలంగా కనిపించిన శ్రీశైలాన్ని తన బానిసగా చేసుకోవలనుకుంటున్న దొర, వాడి గొర్రెల మాయం చేసి వాన్నే దొంగను చేస్తాడు. దాంతో గొర్ల కాపర్లు సంఘం పెడితే ఏమైంది అన్నదే… భూపాల్ రెడ్డి రాసిన కథకు దృశ్య రూపం ఈ నాటిక.
మూలకథ: భూపాల్ రెడ్డి
నాటకీకరణ: సి.హెచ్. నటరాజ్ గోపాలమూర్తి
దర్శకత్వం: డా. ఆంథోని రాజ్
30 – 12 – 2018 | 7:00 P.M