7 మార్చ్ 2018: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (ర.భ.) ముఖ్య ఇజనీరు పింగిలి సతీష్, రైల్వే సి.ఇ. జి.వి. రమణారెడ్డి మరియు సింగరేణి కాలరీస్ జి.ఎం. జె.వీ.ఎల్. గణపతి మరియు లింగయ్య, సి.ఇ. ర.భ. లతో భద్రాచలం రోడ్డు నుండి కొవ్వూరు వరకు నూతన బ్రాడ్ గేజ్ రైల్వే లైను అలైన్ మెంటు ప్లానును పరిశీలించడము జరిగినది. ఈ సమావేశములో భద్రాచలం రోడ్డు నుండి సత్తుపల్లి వరకు, సత్తుపల్లి నుండి దమ్మపేట మరియు జీలుసమిల్లి (తెలంగాణ హద్దు వరకు) సుమారు 105 కి.మీ. అలైన్ మెంటును పరిశీలించడము జరిగినది.
ఇంతకు క్రితము 1960లో సూచించిన అలైన్ మెంటును ఈ మధ్య సత్తుపల్లి మరియు పరిసర ప్రాంతాలలో సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మరియు చుట్టూ ప్రక్కల గ్రామా ప్రజల రవాణా సౌకర్యార్ధము భద్రాచలం రోడ్డు నుండి కొవ్వూరు వరకు ప్రతిపాదించిన రైల్వే లైనును సత్తుపల్లి దమ్మపేట ద్వారా జీలుసమిల్లి (తెలంగాణ హద్దు వరకు) కొవ్వూరు వరకు ప్రతిపాదిత బ్రాడ్ గేజ్ రైల్వే లైనులు తెలంగాణ హద్దు వరకు మంత్రి గారు పరిశిలించి తగిన సూచనలు అధికారులకు ఇవ్వడము జరిగింది.
ఇంతకు ముందు జరిగిన సమావేశంలో ఈ క్రింది ప్రతిపాదించిన నిర్మాణాలను త్వరితగాతిగా చేపట్టి వాటిని ప్రారంబించేల చెర్యలు తీసుకోవాలని సూచించారు.
- మొత్తం రాష్ట్రంలో ఉన్న 460 రైల్వే లెవెల్ క్రాసింగులకు ఆర్వోబి ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలకు శ్రీకారం. ఈ 460 ఆర్వోబీలు నిర్మాణం దశల వారీగా చేపట్టేందుకు ప్రతిపాదనలు
- ఈ సంవత్సరం 52 ఆర్వోబీలు నిర్మాణానికి ప్రతిపాదనలు ఆమోదం
- ఈ సంవత్సరం 52 ఆర్వోబీలు నిర్మాణానికి 2700కోట్లతో అంచనాలు సిద్ధం
- రైల్వే శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 నిష్పత్తిలో ఈ నిర్మాణాలు చేపడతాయి
- రోడ్ ఓవర్ బ్రిడ్జి మరియు రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపిన తుమ్మల
- రైల్వే లెవెల్ క్రాసింగుల వద్ద ప్రమాదాల నివారణకు మరియు ట్రాఫిక్ అంతరాయాలు తగ్గించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని తెలిపిన మంత్రి తుమ్మల
- రాష్ట్రంలో నాలుగు వరుసల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతున్నందున నాలుగు వరుసల ఆర్వోబిల నిర్మాణానికి సుముఖం – రైల్వే శాఖను ఒప్పించిన మంత్రి తుమ్మల
- రాష్ట్రంలో ఉన్న పాత ఆర్వోబీలకు ట్రాఫిక్ జామ్ ఉన్న ఆర్వోబీలు పునరుద్ధరణకు నిధులు సమకూర్చాలని రైల్వే జిఎం ను కోరిన మంత్రి తుమ్మల
- రాష్ట్రంలో ఉన్న పాత ఆర్వోబీలకు ట్రాఫిక్ జామ్ ఉన్న ఆర్వోబీలు పునరుద్ధరణకు నిధులు సమకూర్చాలని రైల్వే సి.ఇ. ను కోరిన మంత్రి తుమ్మల
- హైదరాబాద్ శివారు మియాపూర్-పటాన్చెరువు ప్రాంతం లో రైల్వే టెర్మినల్ నిర్మాణానికి ప్రతిపాదనల పరిశీలన లో ఉన్నదని తెలిపిన తుమ్మల
- ఎంఎంటీఎస్ డిసెంబర్ 2018 కి పూర్తి – తుమ్మల