నల్లగొండ జిల్లా …
అక్టోబర్,21:- పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి జగదీష్ రెడ్డి, కలెక్టర్ , జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మరియు అమరవీరుల కుటుంబ సబ్యులు తదితరులు అమరవీరులకు నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని జిల్లా పోలీస్ కార్యాలయం లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో అయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిరు. పోలీసులంటే ప్రాణాలు పోయినా ప్రజల ప్రాణ నష్టాలు జరగకుండా కాపాడే వారన్నారు.ఈ సందర్బంగా యస్ పి గారు మాట్లాడుతూ అక్టోబర్ 21 వ తేది చరిత్రలో లికించిన రోజు అన్నారు. 1960 నుంచి ఈ పోలీసు అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరులైన పోలీస్ త్యాగాలు వృదాగా పోవని వారి త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవలన్నారు. శాంతి భద్రతలు కాపాడడలో పోలిసుల పాత్ర అనిర్వచనియమన్నారు. పోలిసుల అసాధారణ సేవల కారణంగానే శాంతిభద్రతలు సుభిక్షమై ప్రజలంతా ప్రశ్నతంగా నిద్రపోగల్గుతున్నారని అన్నారు. ప్రస్తుతం పొలీసు వ్యవస్థ చాలా పతిష్టంగా ఉందని పేర్కొన్నారు.
“అమర వీరుల పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం”
విధి నిర్వహణలో ప్రాణాలు తృణప్రాయంగా అర్పించిన అమర పోలీస్ జవాన్ల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హామీ ఇచ్చారు . జమ్మూ కాశ్మీర్ లోని లెహ్ లద్దాక్ ప్రాంతంలో జరిగిన CRPF జవాన్ల మృతి అనంతరం వారి సంస్మరణార్థం ప్రతి ఏట అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌజ్, క్విజ్, వ్యాసరచన,రక్తదాన శిబిరం 2 km రన్ తదితర కార్యక్రమాలను నిర్వహించి, గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు. పోలీసుల అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అమరవీరుల కుటుంబాలు, వివిధ పాటశాల విద్యార్థులతో కలిసి పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.