నగరంలోని పలు ప్రాంతాల్లో రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కే టీ రామ రావు విస్తృత పర్యటన
హైదరాబాద్ నవంబర్ 21: నగరంలోని పలు ప్రాంతాల్లో మంత్రి కే.టి .ర్ విస్తృతంగా పర్యటించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి ముషీరాబాద్, నారాయణగూడలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు.
లోయర్ ట్యాంక్ బండ్ నాలా, దోమల గూడ, చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్, సిటీ సెంట్రల్ లైబ్రరీతో పాటు కవాడిగూడ వాల్మీకి అంబేద్కర్ ఆవాస యోజన గృహ సముదాయాలను పరిశీలించారు. బన్సీలాల్ పెట్ లో ఉన్నత ప్రమాణాలతో నిర్మించిన ఆధునిక కమ్యూనిటీ హాల్ ను పరిశీలించారు.
నగర గ్రంధాలయ అభివృద్ధికి రూ . 5 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి కే టి ఆర్ ప్రకటించారు. పలు పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగులతో మంత్రి మాట్లాడారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఆధునిక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కే టి ఆర్ తెలిపారు. చిక్కడపల్లి మార్కెట్ లో అధునాతన మార్కెట్ నిర్మాణం చేస్తామని తెలిపారు.
రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నగర్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెలేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, మాగంటి గోపినాథ్, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి నగరం లోని పలు ప్రాంతాల్లో మంత్రి కే.టి .ర్ పర్యటన నేడు విజయవంతంగా కొనసాగింది.