ప్రగతి భవన్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో ఉన్న దుర్గామాత ఆలయంలోని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం వాహన పూజ, ఆయుధ పూజలు చేశారు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్లో పని చేస్తున్న సిబ్బందికి సీఎం కేసీఆర్ పేరు పేరునా పిలిచి శుభాకాంక్షలు తెలిపారు.