త్వరలో కొత్త రూ.50 నోటు
ముంబై ఆగష్టు 18(ఎక్స్ ప్రెస్ న్యూస్): నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 500, 2000 నోట్లను కేంద్రం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. పాత 500, 1000 నోట్లను బ్యాన్ చేసిన ప్రభుత్వం.. రూ. 5, 10, 50, 100 నోట్లను మార్చలేదు. అవి అలాగే చలామణిలో ఉన్నాయి. అయితే.. ఇప్పుడు కొత్త రూ.50 నోట్లను తీసుకురానున్నదట ఆర్బీఐ. కొత్త నోటుకు సంబంధించిన నమూనా ను కూడా విడుదల చేసింది ఆర్బీఐ. అచ్చం కొత్త రూ. 500 నోటు లాగానే ఉండే ఈ నోటు వెనక భాగంలో మాత్రం దేశ సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా… హంపీ రథాన్ని చేర్చింది. కొత్త రూ. 500 నోటు వెనక భాగంలో ఎర్ర కోట ఉంటే రూ. 50 నోటు పై హంపీ రథాన్ని చేర్చి దేశ చారిత్రక సంపదను దేశ ప్రజలకు తెలిసేనా వినూత్నంగా ఆలోచించింది ఆర్బీఐ. మహాత్మా గాంధీ కొత్త చిత్రంతో పాటు ఆర్బీఐ గవర్నర్ డా. ఆర్. ఉర్జిత్ పటేల్ సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. లైట్ బ్లూ కలర్ లో ఈ నోట్లు ఉండనున్నాయి. ఇప్పటికే వీటి ప్రింటింగ్ కూడా అయిపోయినట్లు సమాచారం. అయితే.. రూ. 50 కొత్త నోటు ను ఆర్బీఐ ఎప్పుడు రిలీజ్ చేస్తుందనే విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కొత్త రూ. 50నోట్లు చలామణిలోకి వచ్చినప్పటికీ.. పాత రూ. 50నోట్లు రద్దవ్వవని.. పాతవి కూడా చలామణిలో ఉంటాయని ఆర్బీఐ పేర్కొన్నది.