గ్రామీణ ప్రాంతాలకు ఆయా ప్రాంతీయ భాషలలో సాహిత్యాన్ని అందించాలి – కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు
మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ కంప్యూటర్, సామాజిక మాధ్యమాల యుగంలో కనీస కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం ఎంతైనా అవసరం అలాగే గ్రామీణ ప్రాంతాలకు ఆయా ప్రాతీయ భాషలలో సాహిత్యాన్ని అందించాలని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు వెల్లడించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిదాలయంలో 35వ కంప్యూటర్స్ ప్రారంభోత్సవంలో సోమవారం జరిగింది. ఈ సంధర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ దేశంలోని పుస్తక పఠనం కొంతవరకు కొంతమేర తగ్గిందని అంతమాత్రాన రచయితలు తగ్గలేదన్నారు.
భాషను సుసంపన్నం చేయడానికి గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కవులు, రచయితలతో కవితా గోష్టి లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రజలు సామాజిక మాధ్యమాలపై మక్కువ చూపెడుతున్నారని, వాటి ద్వారా కూడా సాహిత్య పరిజ్ఞానాన్ని కొంతమేరకు అవగాహన కలిగించుకోవడానికి ప్రయత్నం జరగాలన్నారు. ఇంగ్లీష్ భాష అధికారిక భాష కాకపోయినా మన నిత్యా జీవిత అవసరాలకు ఇంగీష్ భాషనే ఎక్కువగా వాడుతున్నాము. తద్వారా భవిష్యత్తులో తెలుగు భాష వాడుక క్రమంగా తగ్గే అవకాశం ఉందని, కావున తెలుగు భాష ను సామాజిక మాధ్యమాల అవసరాలకు కూడా వాడటం అలవాటు చేసుకోవాలని అన్నారు.
దేశంలోని 24 భాషలను అధికారికంగా కేంద్ర సాహిత్య అకాడమీ గుర్తించిందని, ప్రతి సంవత్సరం 684 గ్రంథాలను ప్రచురిస్తుందని అందులో 155 గ్రంథాల వరకు తెలుగు భాషకు సబంధించినవి ఉన్నాయన్నారు. తల్లి తండ్రులు కూడా కొంతవరకైనా సాహిత్యం చదవాలని అది వారి పిల్లలకు కూడా నేర్పించేందుకు చొరవ చూపాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనగా ఏర్పాటు చేసిన సాహిత్య అకాడమీకి కూడా తవవంతు సహాయసహకారం ఉంటుందన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ సాహిత్య వాతావరణం తగ్గడం మూలాన కొంతమేరకు మానవీయ సంబంధాలను కొల్పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాహిత్యం మనుషులను కలుపుతూ, పుస్తక పఠనం ద్వారా సంస్కారం పెరుగుతుందని తద్వారా జీవితంలో ఘర్షణ వాతావరణ వికృత దశకు చేరకుండా అరికట్టవచ్చన్నారు.
ప్రస్తుతం సమాజంలో గొప్ప సాహిత్యం అందుబాటులో ఉందని, కంప్యూటర్లోని అంతర్జాలం ద్వారా అందిపుచ్చుకొని సాహిత్య విలువలను తెలుసుకోవచ్చని విధ్యార్థులకు సూచించారు. తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ నేటి పోటీ ప్రపంచంలోఉన్నత విద్య అభ్యసించినా కంప్యూటర్ పరిజ్ఞానం లేకుంటే నిరక్షరాస్యులతో సమానమన్నారు. ఎలాంటి వయోభేధం లేకుండా తెలుగు యూనివర్సిటీలో కంప్యూటర్ కోర్సులో చేరవచ్చన్నారు. రిజిస్ట్రార్ సత్తిరెడ్డి, కంప్యూటర్ విభాగం సంచాలకులు ఆచార్య సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.