తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో ఇందిరప్రియదర్శిని ఆడిటోరియంలో భగీరథ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్ర సగర సంఘం ఆధ్వర్యంలో ఇందిరప్రియదర్శిని ఆడిటోరియంలో భగీరథ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈటల. మంత్రి ఈటల మాట్లాడుతూ, అణగారిన వర్గాలకు అండగాఉండడమే మన ప్రభుత్వాలక్షంగా ఉండాలని కేసీఆర్ గారు మాకు చెప్పారు. సీఎం గారు బడ్జెట్లో ఒక పేజీ రాయించారు. ప్రతికులనికి ఒక ఆత్మగౌరవ భవనం నిర్మచాలని చెప్పారు. బీసీ ల అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాం. ఒకే సారి 123 రెసిడెన్సిల్ స్కూల్స్ పెట్టినం. స్కూల్ ఫీజుల నుండి విముక్తి కల్పించినం. భగీరథుని స్ఫూర్తితోనే ఇంటింటికి మంచినీరు అందిస్తున్నాం అని అన్నారు.
నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులను పీఎం టేబుల్ మీద వేసి మొక్కిన మంచినీరు అందలేదు మేము అందిస్తుంన్నాం. పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచినయి అని పాడుకున్నాము కానీ ఈ రోజు అపర భగీరథుడు కేసీఆర్ నోరెళ్ళబెట్టిన ప్రతి బీడు భూమికీయా నీరు అందించే యజ్ఞం చేస్తున్నాడు అని ఈటల తెలిపారు.
సగరులకోసం తెలంగాణ ప్రభుత్వం చాలా చేస్తుంది. 50 లక్షల వరకు emd లేకుండా కాంట్రాక్ట్ చేసుకొనే అవకాశం కల్పించడంతో ఎంతోమంది మెస్త్రీలు కాంట్రాక్టర్స్ గా ఎదిగారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని ఈటల అన్నారు.