రవీంద్రభారతి లో తెలంగాణ ప్రభుత్వం బాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కి.శే డా.సి.నారాయణరెడ్డి 87వ జయంతి కార్యక్రమం
ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎం.పి కల్వకుంట్ల కవిత సి.నారాయణరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం నారాయణరెడ్డి గారితో ప్రముఖుల అనుభవాలు , వ్యాసాలు, కవితలతో రూపొందుకున్న “స్మర నారాయనీయం” పుస్తకాన్ని ఆవిష్కరించారు. కవిత మాట్లాడుతూ మహనీయుడు సి.నారాయణరెడ్డి నుంచి ఈ తరం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్ అభివృద్ధికి తన ఎంపీ నిధుల నుంచి రూ. 10 లక్షలు ఇస్తానని కవిత ప్రకటించారు.
ఈ కార్యక్రమనికి రాష్ట్ర సాహిత్య చైర్మన్ నందిని సిద్ధారెడ్డి అధ్యక్షతన వహించగా సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, సీఎంఓ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ , తెలుగు యూనివర్సిటీ వి.సి సత్యనారాయణ, ఆచార్య ఎన్. గోపి, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి బుర్ర వెంకటేశం, బాషా సంచాలకులు మామిడి హరికృష్ణ, ఎల్లూరి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.