తెలంగాణ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీ అవిష్కరించిన మంత్రి కెటి రామారావు
న్యూ డిల్లీ నవంబర్ 4: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటి. రామారావు తెలంగాణ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవిష్కారించారు.
ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఫుడ్ ఇండియా – 2017 లో ఈ పాలసీని ఆవిష్కరించారు. తెలంగాణలో ఉన్న విస్తృతమైన ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ పాలసీ దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ పాలసీ లక్ష్యంగా పేర్కొన్నారు. ఫుడ్ ప్రొసెసింగ్ రంగాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేసి, రైతాంగ ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని అందుకునేలా ఈ పాలసీ రూపొందించామన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణి, గొర్రెల పంపిణి కార్యక్రమాల ను పుడ్ ప్రాసెసింగ్ రంగానికి అనుసంధానం చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచుతామన్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడంతో పాటు, గొర్రెల పెంపకం (లైవ్ స్టాక్) లో రాబోయే ఐదేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారేందుకు ఈ పాలసీ సహకరిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా ఉన్న అనుకూలతల వలన దేశ ఆహరోత్పత్తుల రవాణా హబ్ గా మారుస్తామన్నారు.
ఈ ఫుడ్ ప్రొసెసింగ్ పాలసీ ద్వారా సుమారు 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ కు రావడంతో పాటూ, లక్ష 25 వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమ ద్వారా వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల నాణ్యతలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిపుతామని మంత్రి తెలిపారు. దీంతో పాటూ అగ్రి, ఫుడ్ వాల్యూ చైన్ నిర్మించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. పాలసీ అవిష్కరణ సందర్భంగా విజ్ఝాణ భవన్ లో జరిగిన సమావేశానికి హజరైన పారిశ్రామిక వేత్తలను ఉధ్దేశించి మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చేవారికి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని మంత్రి హామి ఇచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇచ్చేటువంటి సబ్సిడీలను, ప్యాకేజీ వివరాలను తమకందిస్తే… అంతకు మించిన అవకాశాన్ని తాము కల్పిస్తామని పెట్టుబడిదారులకు మంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, అనుమతుల ప్రక్రియ వంటి అంశాలను మంత్రి వారికి వివరించారు. తెలంగాణ రాష్ర్టంలో ఉన్న పుడ్ ప్రాసెసింగ్ రంగంలోని అవకాశాలను మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన మిషన్ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం రంగం మరింత అభివద్ది చెందుతుందన్న మంత్రి, వ్యసాయానుబంధంగా చేపట్టిన కార్యక్రమాలను సైతం వివరించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గత మూడు సంవత్సరాల్లో వ్యవసాయోత్ప్తతుల స్టోరేజీ సామర్ద్యాన్ని ఎన్నో రెట్టు పెంచినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ర్టం ప్రకటించిన ఈ పుఢ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా ఆ రంగంలోని పెట్టుబడి దారులకు అందించే రాయితీలు పాలసీలోని ముఖ్యాంశాలను వివరించారు. పాలసీ వచ్చే ఐదేళ్లు అమలులో ఉంటుంది.రాబోయే ఐదేళ్లలో 20 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తాయి,లక్షా 25 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు ,రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు,ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెలు, చేపల పెంపకం వంటి కార్యక్రమాలను ఫుడ్ ప్రొసెసింగ్ పరిశ్రమతో అనుసంధానం,ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వ్యవసాయ – ఆహార ఉత్పత్తుల వాల్యూ చైన్ ఏర్పాటు,ఇందుకోసం ఫుడ్ ప్రొసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్క్ ల అభివృద్ధి,సగటు ఫుడ్ ప్రొసెసింగ్ స్థాయిని కనీసం 20 శాతం పెంచడం,జాతీయ స్థాయిలో నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా తెలంగాణను మార్చడం,ఈ పాలసీలో భాగంగా స్టార్ట్ అ ప్స్ కోసం అగ్రి టెక్ నిధి ఏర్పాటు,ఫుడ్ ప్రొసెసింగ్ రంగంలో ఇన్నోవేషన్ మరియు, ఆదర్శ విధానాల ప్రమోషన్.
కాగా వరల్డ్ ఫుడ్ ఇండియా 2017లో రెండో రోజు పలు సంస్థలతో అవగాహనా ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్నది. సుమారు 1250 కోట్ల రూపాయల విలువైన 9 ఒప్పందాలను కుదుర్చుకున్నది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖా కార్యదర్శి జయేశ్ రంజాన్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లో బికానీర్ వాలా, ప్రయాగ్ న్యూట్రీ మేన్స్ ఫుడ్స్, కనోరియ గ్రూప్ కు చెందిన అన్నపూర్ణ ఫుడ్స్, కరాచీ బెకరీ, బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో, సంప్రీ గ్రూప్, క్రీం లైన్ డైరీ, పుష్య ఫుడ్స్ సంస్థలున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా సుమారు 3800 మందికి నేరుగా ఉద్యోగావకాశాలు, మరో 20 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలున్నాయి.
నిన్న ఈరోజు కుదుర్చుకున్న ఒప్పందాలతో మెత్తం 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాది లభిస్తుందన్నారు. దీంతోపాటు 45 వేల మంది రైతులకు వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మెళకువలు నేర్పనున్నారు. వీటీతోపాటు మరికొన్ని సంస్థలతో మంత్రి చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి వివరించారు.