నేడు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 71వ వర్ధంతి సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ, రవీంద్రభారతి సిబ్బంది మరియు కళాకారులు రవీంద్రభారతిలో ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ మట్టి పై నేలకొరిగిన తొలి అమరుడు. భూమి కోసం, భుక్తి కోసం, భానిస బంధాల విముక్తి కోసం, వెట్టి చాకిరీ నిర్మూలన కోసం పొరాడిన వ్యక్తి దొడ్డి కొమురయ్య. నేడు వారి 71వ వర్ధంతి సందర్భంగా…
రవీంద్రభారతి సమావేశమందిరంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ…నిజాం పాలనలో ఎవరికి గజం కూడా భూమి లేని సమయాన కొమురయ్య భూమి కోసం, నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన అమరుడు, తెలంగాణ పోరాటం అనగానే మనందరికీ మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్యగారే అని, నిజాం పాలన నుంచి విముక్తి కోసం, భూముల కోసం 1946 నుంచి 1948 వరకు పోరాడటం జరిగింది. 1946లో జరిగిన ఆ పోరాటంలో నేల రాలిన యోధుడు దొడ్డి కొమురయ్య. నేటి తరం వారి చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం తరుపున కొమురయ్య స్వగ్రామమైన కడివెండి గ్రామం, దేవరుప్పల మంII, జనగామ జిల్లాలో వర్ధంతి సభని నేడు గొప్పగా నిర్వహిస్తున్నారని, అలాగే… గౌII ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎప్పుడు చెప్తునే ఉంటారు మన తెలంగాణ, కట్టు, బొట్టు, బోనం, బతుకమ్మ, కళాకారులు, వీరులు, కవిత్వం, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయం మనవి అని. సి.ఎం గారు ఇచ్చిన మాటల వెలుగుల స్పూర్తితో ఇలాంటి ప్రముఖుల జ్ఞాపకార్థం వారికి నివాళి తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 3 సంIIల నుంచి సాంస్కృతిక శాఖ నిర్వహిస్తూనే ఉంది అని, ఇలాంటి గొప్ప ప్రముఖుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ అకౌంట్ ఆఫీసర్ వసుంధర, సూపరింటెండెంట్ నాగరాజు, బిక్షపతి, ప్రసాద్ బాబు, కృష్ణ, ప్రశాంత్, హేమలత, అమృత నరేష్, హమీద్, లక్ష్మి, తహెరా బెగమ్, రవీంద్రభారతి ఇంచార్జ్ మనోహర ప్రసాద్, ఖాన్, సత్తయ్య, వేణు, బాలకృష్ణ మరియు ఇతర సిబ్బంది, కళాకారులు అభిమన్యు, ఒగ్గు రవి, చిత్రకారుడు ప్రభాకర్, లింగయ్య, తెలంగాణ IT అస్సోసియేషన్ సందీప్, భాస్కర్, NRI కవి రవి వీరేళ్ళ, ఇతరులు పాల్గొన్నారు.