కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మతో భేటి అయిన ఎంపిలు బాల్క సుమన్, బిబి పాటిల్, పొంగులేటి శ్రీనివాస్
“కేంద్ర ప్రభుత్వ పథకం స్వదేశి దర్శన్ లో భాగంగా 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్క్యూట్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరాము. కాళేశ్వరం టెంపుల్, శివారం క్రొకడైల్ శాంక్చ్యురి , ధర్మపురి, కోటిలింగాల టెంపుల్, గాంధారి వనం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, బౌద్ధ ఆరామాలు అన్నింటిని కలిసి ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్క్యూట్ డెవలప్మెంట్ పథకంలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశాము.పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్క్యూట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను కేంద్ర మంత్రికి వివరించాము. పూర్తి డిటైర్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ను అధికారులకు అందించాం.సానుకూలంగా స్పందించిన మంత్రి.గత ప్రభుత్వాలు తెలంగాణలో పర్యాటక రంగానికి గుర్తింపును ఇవ్వలేదు.కొత్త రాష్ట్రమైన తెలంగాణకు పర్యాటక రంగంలో కేంద్రం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి, వాటిని అభివృద్ధి చేస్తోంది.”