తెలంగాణ: కెసిఆర్ సారధ్యంలో పద్నాలుగేళ్ళు సాగిన ఉద్యమానికి, అమరుల త్యాగాలకు జరిగిన సన్మానమిది – వీరమల్ల ప్రకాష్
ఈరోజు తెలంగాణ సమాజం నాకు చేసిన సన్మానానికి ప్రతి ఒక్కరికీ పేరు పేరున మనః పూర్వక కృతఙ్ఞతలు.దీనిని తెలంగాణ మార్గదర్శి ఆచార్య జయశంకర్ మార్గదర్శకత్వం లో మన ప్రియతమ నాయకుడు కెసిఆర్ సారధ్యంలో పద్నాలుగేళ్ళు సాగిన ఉద్యమానికి, అమరుల త్యాగాలకు జరిగిన సన్మానమిది.దిన పత్రికల్లో ఒక్క ఆహ్వాన ప్రకటన ఇవ్వకున్నా, టీవీల్లో ఒక్క స్క్రోలింగ్ ఇవ్వకపోయినా వేలాదిగా జనం రావడం సోషల్ మీడియా,తెరాస కార్యకర్తల,ఉద్యమకారుల ద్వారా సాధ్యపడింది.సహకరించిన ప్రతిఒక్కరికీ కృతఙ్ఞతలు.1969,1991,2001 మూడు దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమం లో ముఖ్య పాత్ర నిర్వహించిన వారు వచ్చి అభినందించడం అనిర్వచనీయ అనుభూతిని కలిగించింది.
అభినందన సభకు వచ్చిన మేయర్ బొంతు రామ్మోహన్ శాసన సభాపతి శ్రీ మధుసూధనా చారి, శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఉప సభాపతి పద్మ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, గౌరవ మంత్రులు హరీష్, తుమ్మల,లక్ష్మారెడ్డి,జోగు రామన్న,ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని,నాయిని, శాసన సభ,మండలి సభ్యులు చిన్నా రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,గొంగడి సునీత, రసమయి బాలకిషన్ ముత్తిరెడ్డి, పల్లా రాజేశ్వేర్ రెడ్డి, నారదాసు,మైనంపల్లి తదితరులు పార్లమెంట్ సభ్యులు లోకసభ తెరాస ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి, పసునూరి దయాకర్ మరియు ప్రభుత్వ సలహాదారు వివేక్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమీషనర్ మాడభూషి శ్రీధర్,బీసి కమీషన్ చైర్మన్ బీయెస్ రాములు ,వివిధ కార్పొరేషన్స్ చైర్మన్లు సోమారపు సత్యనారాయణ, విప్లవ్, బొల్లం సంపత్,బాకర్ అలీ, లింగంపెళ్లి సంపత్ రావు, మార్కెట్ కమిటి ల చైర్మన్ పుటం పురుషోత్తం, ఇతరులు సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ చీఫ్ సెక్రెటరీస్ అజయ్ మిశ్రా,జోషి , ఈ పీ టి ఆర్ ఐ చీఫ్ కళ్యాణ్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి, ఈఎన్సీ లు మురళీధర్, విజయప్రకాశ్ ,ఇతర ఇంజనీర్స్ చీఫ్ పీ ఆర్ ఓ జ్వాలా నరసింహా రావు,పీఆర్ఓ విజయ్,, ఐ ఐ టీ ప్రొ. నిశాంత్ దొంగరి ప్రఖ్యాత వ్యాఖ్యాత,ఏ ఐ ఆర్ దక్షిణా మూర్తి ,TITA,Walk for Water volunteers అందరికీ పేరు పేరున కృతఙ్ఞతలు. జై తెలంగాణ.