-నీళ్లున్న చోటే నాగరికత
-తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చేస్తాం
-ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు
-మంత్రి హరీష్ రావు
సీఎం కేసీఆర్ ఓ ఇంజినీర్లాగా ప్రాజెక్టులన్నీ రీడిజైన్ చేశారని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణ కోసం ఎన్నో సార్లు పదవులు త్యాగం చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.దేశంలో ఫుల్ కరెంట్ ఉంటే కర్ణాటకలో రైతులకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఘనత కూడా టీఆర్ ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు.
పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రూ. 75 వేలు ఇస్తున్నట్టు చెప్పారు.నారాయణపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీరు ఇవ్వనున్నట్టు తెలిపారు.కాంగ్రెస్ పాలనలో కరెంట్ వస్తే వార్త కాని టీఆర్ఎస్ పాలనలో కరెంట్ పోతే వార్త అని చెప్పారు.మహిళలు మంచినీటికి ఇబ్బంది పడవద్దనే మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టినట్టు హరీశ్ రావు వివరించారు.
ప్రాజెక్టులు పూర్తి కావొద్దన్న ఎజెండాతో కాంగ్రెస్ పనిచేస్తున్నట్టు మంత్రి విమర్శించారు.రాబోయే కొద్ది రోజులలోనే నారాయణపేట నియోజకవర్గంలో కెనాల్ పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు.మరికల్కు నూతన మార్కెట్ యార్డు మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.