తల్లీబిడ్డ సురక్షితంగా.. కేసీఆర్ కిట్ల పథకానికి అనూహ్య స్పందన – లక్ష్మారెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి
-77రోజుల్లో 4.33 లక్షల మంది గర్భిణుల నమోదు
-సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న ప్రసవాలు
మాతా శిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పథకం సమర్థంగా కొనసాగుతున్నది. ఈ పథకంద్వారా లబ్ధిపొందేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4.33 లక్షల మంది గర్భిణులు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పథకం ప్రారంభమై ఇప్పటికి 77 రోజులు పూర్తికాగా.. ఇప్పటివరకు 47,416 మందికి కిట్లను పంపిణీ చేశారు. ఒక్కో కాన్పునకు రూ.రెండు వేల విలువైన కిట్తో కలుపుకొని ఆడబిడ్డ పుడితే రూ.15వేలు, మగబిడ్డ అయితే రూ.14వేలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక పథకం కారణంగా సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2017-18లో ప్రభుత్వ దవాఖానల్లో మూడులక్షల ప్రసవాలు జరుగుతాయని భావించినా.. అంచనాలకు మించి ఇప్పటికే 4,33,194 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
పథకం సమర్థంగా అమలవుతున్నది
నిరుపేద కుటుంబాలకు చెందిన గర్భిణులు నెలలు నిండిన తర్వాత పనులు చేయకూడదనేది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచన. అందుకే ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అలాగే సర్కారు దవాఖానల్లో ప్రసవాలు చేయించుకునేవారికి కేసీఆర్కిట్ల పథకం ద్వారా 16 రకాల వస్తువులు ఇస్తున్నాం. ఈ పథకాన్ని సమర్థంగా నిర్వహిస్తున్న కారణంగా సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.