దక్కన్ సాహిత్య సభ ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య డా.ఎన్.గోపి రచించిన ‘జలగీతం’ కావ్యానికి కవి, విమర్శకుడు ఎం.నారాయణ శర్మ సంస్కృతానువాదం ‘జల గీతమ్’ మరియు ఎన్.గోపి ‘జలగీతం- కావ్య సమాలోచనం’ వ్యాస సంపుటి పుస్తకాలను రవీంద్రభరతి సమావేశ మందిరంలో ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి డా. పత్తిపాక కృష్ణ మోహన్, ఆచార్య జి.ఎన్.ఆర్. కృష్ణమూర్తి, భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జలజం సత్యనారాయణ, డా. ప్రభాకర్ జైని, డా. పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.