డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా హన్మకొండ అంబెడ్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్ బండ ప్రకాష్, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు,కలెక్టరు ఆమ్రపాలి, హరిత, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ రవీందర్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.