జాతీయస్థాయి ప్రతిష్టాత్మక “52వ స్కోచ్ అవార్డు” యావత్ తెలంగాణ కళలకు, కళాకారులకు అంకితం: బాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ
తెలంగాణ కళలు పై తెలంగాణ గళం వినిపించి, జాతీయస్థాయి ప్రతిష్టాత్మక “స్కోచ్ అవార్డు”ను ఈరోజు న్యూఢిల్లీలో అందుకొన్న సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ.
ఈ అవార్డు యావత్ తెలంగాణ కళలకు, కళాకారులకు అంకితం చేసి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రోత్సాహం అందిస్తున్న అధికారులందరికి సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
న్యూఢిల్లీలోని స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ వారు నిర్వహించిన ఆర్డర్ అఫ్ మెరిట్ లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు జాతీయస్థాయి ప్రతిష్టాత్మక “స్కోచ్ పురస్కారం” దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఆన్ లైన్ ద్వారా కళాకారులకు ఐడి కార్డులను ఇవ్వలేదు, మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వ పథకాల వితరణకు కూడా ఈ కళాకారుల డేటాబేస్ ఉపయోగపడేలా రూపొందించింది సాంస్కృతిక శాఖ.
ఈ పురస్కారం నూతన తెలంగాణ రాష్ట్రంలో “అవర్ ఆర్ట్ – అవర్ ఐడెంటిటి” అనే కాన్సెప్ట్ తో వినూత్న సాంకేతిక ప్రయోగంతో వెబ్ సైట్ ద్వారా తెలంగాణలోని కళాకారులకు గుర్తింపు కార్డులు సాంస్కృతిక శాఖ అందచేస్తుంది. ప్రతీ కళాకారుడు ఆన్ లైన్ లో అప్లై చేసుకొని ID కార్డు పొందవచ్చు, దీనిద్వారా మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రతి కళాకారుడికి వారివారి కళారూపాన్నిబట్టి ఐడీ కార్డు లభిస్తుంది. అలాగే…, ఆయా కళాకారుల డేటాబేస్ కూడా ఆన్ లైన్ లో అప్ లోడ్ అయి ఉంటాయి.
సాంస్కృతిక శాఖ యొక్క ఈ నవ్య ఆలోచనని ‘స్కోచ్ అవార్డు’ కమిటీ బృందం ప్రశంసించి అవార్డుకు ఎంపికచేసింది న్యూఢిల్లీలో జరిగిన “52వ స్కోచ్ సమ్మిట్” కార్యక్రమంలో ఈ అవార్డుని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అందుకొన్నారు.
ఈ అవార్డు యావత్ తెలంగాణ కళలకు, కళాకారులకు అంకితం.
తనకు నిరంతరం స్ఫూర్తిగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రోత్సాహం అందిస్తున్న పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు అజ్మీరా చందూలాల్ గారికి, ప్రభుత్వ సలహాదారులు డా. కే.వి. రమణాచారి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వేంకటేశం, I.A.S, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు రసమయి బాలకిషన్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి వీరందరికి సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ధన్యవాదాలు తెలిపారు.
ఢిల్లీలో “స్కోచ్ అవార్డు” స్వీకార కార్యక్రమానికి సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తో పాటు సాంస్కృతిక శాఖ ఆకౌంట్ ఆఫీసర్ ప్రసాద్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల పాల్గొన్నారు.