జహంగీర్పీర్ దర్గాను సందర్శించిన తెలంగాణ సిఎం కేసీఆర్
హైదరాబాద్ నవంబర్ 10: షాద్నగర్ మండంలోని ప్రసిద్ధ జహంగీర్పీర్ దర్గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం కోరిన మొక్కును శుక్రవారం కేసీఆర్ చెల్లించుకున్నారు. గతంలో మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడు దర్గాను కేసీఆర్ దర్శించారు.
దర్గాలో కేసీఆర్తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ కలిసి భోజనం చేశారు.