చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఇచ్చే చేప ప్రసాదం కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మృగశిర కార్తె ను పురస్కరించుకుని జూన్ 8,9 తేదీలలో ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిన సోదరులు చేప ప్రసాదం పంపిణి చేయడం ఆనవాయితీ గా వస్తుందన్నారు। దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఉబ్బసం వ్యాధిగ్రస్థులు నమ్మకం తో వస్తుంటారన్నారు। తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ నాటి నుండి ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణి కి అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు .ఈ ఏడాది ఆరోసారి కూడా పంపిణి కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు .వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగా కుండా అన్ని శాఖా అధికారులు కృషి చేశామన్నారు. గత మూడు రోజులుగా అన్ని శాఖా ల సమన్వయము తో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు . ప్రజల సౌకర్యార్ధం ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో100 మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయగా, మూడు షిఫ్టులలో షిఫ్ట్ కు 100 మంది చొప్పున పారిశుధ్య సిబ్బంది విధులలో పాల్గొంటున్నారన్నారు. మత్య్స శాఖా సుమారు లక్ష అరవై వేల చేప పిల్లలను చేప ప్రసాదం పంపిణి కోసం అందుబాటు లో ఉంచిందన్నారు. మొత్తం 35 కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేస్తున్నారన్నారు .అంతేకాకుండా ప్రజల సౌకర్యార్ధం ఆరు వైద్య శిబిరాలు ,అంబులెన్సులు కూడా అందుబాటు లో ఉంచామన్నారు . నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం మొబైల్ ట్రాన్స్ఫార్మర్ లు , జలమండలి ద్వారా మూడు లక్షల మంచినీటి సాచెట్లు ,ట్యాంకర్లు కూడా ఏర్పాటు చేశారన్నారు. ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో వ్యాధిగ్రస్తుల తాకిడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకు సీసీ టీవీ లను ఏర్పాటు పోలీస్ శాఖా నిరంతరం నిఘా వేసిందన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందో బస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ని కూడా పోలీస్ శాఖా పర్యవేక్షితుందన్నారు. రోడ్లు భవనాల శాఖా బెరికేడింగ్ ఏర్పాటు ఉబ్బసం వ్యాధిగ్రస్థులు క్రమ పద్దతిలో వెళ్లి చేప ప్రసాదం వేసుకునేలా ఏర్పాట్లు చేసింది .హైదరాబాద్ జిల్లా రెవిన్యూ యంత్రంగం తరపున 14 మంది తహసీల్దార్లు, ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో కారక్రమం ప్రశాంతంగా జరిగేలాగా ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. వ్యాధిగ్రస్తుల సౌకర్యార్ధం ఆర్ టి సి వారు నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ విరివిగా బస్సు సర్వీసులు నడుపుతున్నారన్నారు. నగరానికి చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజలు చేప ప్రసాదాన్ని తీసుకొని వారి వారి ప్రాంతాలకు క్షేమంగా చేరాలని మంత్రి ఆకాంక్షించారు.