-
కాళేశ్వరంతో శనిగరం అనుసంధానం.
-
ఖరీఫ్ లో 5,100 ఎకరాల కు సాగునీరు.
– మంత్రి హరీశ్ రావు.
కాళేశ్వరం ప్రాజెక్టును కాళేశ్వరంతో అనుసంధానం చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.దీంతో రెండు పంటలు సాగవుతాయని చెప్పారు.నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల చారిత్రక శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు ఆధునీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు.వచ్చే ఖరీఫ్ లో 5,100 ఎకరాలను సాగులోకి తీసుకొస్తామన్నారు.
గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆయన బుధవారం శనిగరం దగ్గర విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతుల బాగు కోసం పాటుపడలేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక శనిగరం ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.22 కోట్ల 72 లక్షలను మంజూరు చేశామని తెలిపారు. శనిగరం లో 1904 లో నిర్మించిన గెస్ట్ హౌజ్ ను చారిత్రక,పురాతన వారసత్వ సంపదగా కాపాడుతూనే దీన్ని పునరుద్ధరించి, అన్ని హంగులతో
ఆధునీకరిస్తామని హరీశ్ రావు చెప్పారు. ఇందుకు గాను 50 లక్షలను కేటాయించామన్నారు. ప్రాజెక్టు ఆధునీకరణ పనుల తర్వాత గెస్ట్ హౌజ్ పనులు చేపడతామని చెప్పారు.ఉద్యమ సమయంలో ఎన్నో సందర్భాల్లో ప్రాజెక్టు ఆధునీకరణ గురించి రైతులు కోరారని అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రాజెక్టు ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. వంద ఏళ్ల కిందటి ప్రాజెక్టు కావడంతో కాల్వలన్ని పూడుకపోయాయని అన్నారు. వాటన్నింటినీ ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. వర్షాలు రాకపోయినా 365 రోజులు నీళ్లుండేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తే రైతులు రెండు పంటలు పండించుకుంటారని చెప్పారు.
రైతు మొగులుకేసి చూసే రోజులు పోతాయని మంత్రి చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి గోదావరి నీళ్లను త్వరలోనే తీసుకువస్తామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రైతులు ఇక మొగులుకేసి చూసే రోజులు పోతాయన్నారు.