కరీంనగర్ నగర్ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం శాతవాహన అర్భన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం ప్రగతి భవన్ లో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు శ్రీ ఈటెల రాజేందర్, శ్రీ కెటి. రామారావు, ఎమ్మెల్యేలు శ్రీ గంగుల కమాలాకరు, శ్రీ రసమయి బాలకిషన్, శ్రీమతి బి. శోభలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అందించారు.